Harish Rao | మీరే నా ప్రపంచం.. ఎప్పుడైనా మా ఇంటికి రావొచ్చు: మంత్రి హరీశ్ రావు
వైద్యం, పింఛన్ల కోసం ప్రత్యేక సిబ్బంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులను కేసీఆర్ సర్కారు గుండెల్లో పెట్టుకుంది బోధకాల వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ రాష్ట్రంలో సిద్దిపేట నుంచే నాంది రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తన ఇంటికి మీరు ఎప్పుడైనా రావచ్చని.. మీరే నా ప్రపంచమని.. మీ ఆనందమే నాకు సంతృప్తిగా ఉంటుందని.. వైద్యం, ఆసరా పింఛన్లకు సంబంధించిన సమస్యలు గురించి మీకు సేవ చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉన్నారని.. వారు […]

- వైద్యం, పింఛన్ల కోసం ప్రత్యేక సిబ్బంది
- ఫైలేరియా వ్యాధిగ్రస్తులను కేసీఆర్ సర్కారు గుండెల్లో పెట్టుకుంది
- బోధకాల వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ రాష్ట్రంలో సిద్దిపేట నుంచే నాంది
- రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తన ఇంటికి మీరు ఎప్పుడైనా రావచ్చని.. మీరే నా ప్రపంచమని.. మీ ఆనందమే నాకు సంతృప్తిగా ఉంటుందని.. వైద్యం, ఆసరా పింఛన్లకు సంబంధించిన సమస్యలు గురించి మీకు సేవ చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉన్నారని.. వారు మీకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం రూ.40 లక్షలతో పైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రక్రియగా సిద్దిపేట నుంచి ఉచిత కిట్స్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫైలేరియా వ్యాధిగ్రస్తులను బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూస్తున్నదని, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు పడుతున్న బాధలు దృష్టిలో పెట్టుకుని ఆసరా ఫించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
పైలేరియాతో బాధ పడుతున్న వారికి కొంత ఊరట కోసం మందులు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్లు తయారీ చేసి జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 8 వేల 121 మంది పై చిలుకు ఫైలేరియా బాధితులకు ఉచితంగా కిట్స్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
3 నెలలకు ఒకసారి మందులు అందిస్తాం
ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు 3 నెలలకు ఒకసారి మందులు అందిస్తున్నామని, వాటిని వాడుకోవాలని, సిద్ధిపేటతో పాటు జిల్లాలోని అన్నీచోట్ల క్లినిక్ ఏర్పాటు చేసి బోధకాల వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించేలా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కంటి వెలుగు బృందాలు మీ వద్దకే వస్తున్నాయని, కంటి వెలుగు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, మీ ఆరోగ్యం బాగు చేసేలా, మీ ఆరోగ్యాన్ని నయం చేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాలసాయిరాం, డీఎంహెచ్ఓ కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.