విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం కమిటీ వేయాలి: ఎమ్మెల్సీ కవిత

గురుకుల పాఠశాలల వసతి గృహాల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థినుల ఆత్మహత్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు

విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం కమిటీ వేయాలి: ఎమ్మెల్సీ కవిత

విధాత : గురుకుల పాఠశాలల వసతి గృహాల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థినుల ఆత్మహత్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని వారి స్వగ్రామమైన మోతె మండలం బురకచర్లలో కవిత పరమార్శించారు. అస్మితకు నివాళులు అర్పించి ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.


ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలని కోరారు. ఇప్పటివరకు విద్యాశాఖ , సాంఘిక సంక్షేమ శాఖలకు మంత్రి లేరని, హాస్టళ్లలో పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నదన్నారు. ప్రతి హాస్టల్‌లో ఫ్రెండ్లి నేచర్ వెదర్ కల్పించాలన్నారు. ప్రతి హాస్టల్లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. ఎలాంటి ఒత్తిడి నైనా తట్టుకునేలా విద్యార్థులను తయారుచేయాలని సూచించారు. అస్మిత కుటుంబానికి బీఆరెస్ పార్టీ అండగా వుంటుందన్నారు. తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దని సూచించారు.