Murder | ఓ ముగ్గురు మైనర్లు రెచ్చిపోయారు. తన సోదరితో మాట్లాడొద్దన్నందుకు.. ఓ 12 ఏండ్ల బాలుడిని సైకిల్ చైన్తో చంపేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సియోని జిల్లా కేంద్రానికి సమీపంలోని మగర్ఖాతా గ్రామానికి చెందిన ఓ 16 ఏండ్ల బాలుడు.. స్థానికంగా ఉన్న ఓ అమ్మాయితో తరుచుగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు గమనించాడు. దీంతో తన సోదరితో […]
Murder | ఓ ముగ్గురు మైనర్లు రెచ్చిపోయారు. తన సోదరితో మాట్లాడొద్దన్నందుకు.. ఓ 12 ఏండ్ల బాలుడిని సైకిల్ చైన్తో చంపేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సియోని జిల్లా కేంద్రానికి సమీపంలోని మగర్ఖాతా గ్రామానికి చెందిన ఓ 16 ఏండ్ల బాలుడు.. స్థానికంగా ఉన్న ఓ అమ్మాయితో తరుచుగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు గమనించాడు. దీంతో తన సోదరితో మాట్లాడొద్దని 16 ఏండ్ల యువకుడిని 12 ఏండ్ల బాలుడు హెచ్చరించాడు.
బాలుడిపై కక్ష పెంచుకున్న 16 ఏండ్ల యువకుడు అతన్ని అంతమొందించాలని నిర్ణయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. తన ఇద్దరు స్నేహితులైన మైనర్లతో కలిసి 12 ఏండ్ల బాలుడిని నిర్మానుష్య ప్రదేశానికి ఆదివారం పిలిపించారు. బాలుడి గొంతుకు సైకిల్ చైన్ బిగించి చంపేశారు.
అనంతరం పదునైన ఆయుధంతో గొంతు కోశారు. అంతటితో ఆగకుండా తలపై రాయితో బలంగా కొట్టారు. అనంతరం డెడ్బాడీని ఓ ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి.. స్థానికంగా ఉన్న రాళ్ల కుప్పపై పడేశారు.
అయితే ప్లాస్టిక్ బ్యాగులో నుంచి రక్తం కారుతున్న విషయాన్ని ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్లాస్టిక్ బ్యాగులోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టి.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జువైనల్ హోంకు తరలించారు.