విధాత: జబర్దస్త్ ఫేం వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన బలగం మూవీ క్లైమాక్స్లో తోడుగా మాతో ఉండి అనే పాటను పస్తం మొగిలయ్య (Mogilaiah), కొమురమ్మ దంపతులు ఆలపించిన సంగతి తెలిసిందే. ఈ పాట తెలంగాణలో ఎంతో మంది హృదయాలను తాకింది. అయితే పస్తం మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆదుకోవాలని ఆయన భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని వేడుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తక్షణమే స్పందించి, మెరుగైన చికిత్స నిమిత్తం […]
విధాత: జబర్దస్త్ ఫేం వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన బలగం మూవీ క్లైమాక్స్లో తోడుగా మాతో ఉండి అనే పాటను పస్తం మొగిలయ్య (Mogilaiah), కొమురమ్మ దంపతులు ఆలపించిన సంగతి తెలిసిందే. ఈ పాట తెలంగాణలో ఎంతో మంది హృదయాలను తాకింది.
అయితే పస్తం మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆదుకోవాలని ఆయన భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని వేడుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తక్షణమే స్పందించి, మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ నుంచి నిమ్స్కు తరలించాలని అధికారులను ఆదేశించారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్యకు నిన్న ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో.. హైదరాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో నిమ్స్లో మొగిలయ్యకు ఇవాళ అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఎలాంటి గుండె సమస్య లేదని నిమ్స్ డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ కొనసాగుతుందన్నారు.
దీర్ఘకాలంగా డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో గత ఏడాది కాలం నుంచి మొగిలయ్య డయాలసిస్ చేయించుకుంటున్నారు. మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు.