Hyderabad | నేడు హైద‌రాబాద్‌లో పార్కులు మూసివేత‌.. ట్రాఫిక్ ఆంక్ష‌లు

Hyderabad | విధాత: ఈ నెల 22వ తేదీన హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు పార్కుల‌ను మూసివేయ‌నున్న‌ట్లు హెచ్ఎండీఏ అధికారులు ప్ర‌క‌టించారు. ప‌లు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు కూడా విధిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా గురువారం తెలంగాణ అమ‌రవీరుల స్మార‌క కేంద్రాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న పార్కుల‌ను మూసివేయ‌నున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్‌లను […]

  • By: krs    latest    Jun 21, 2023 9:28 AM IST
Hyderabad | నేడు హైద‌రాబాద్‌లో పార్కులు మూసివేత‌.. ట్రాఫిక్ ఆంక్ష‌లు

Hyderabad |

విధాత: ఈ నెల 22వ తేదీన హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు పార్కుల‌ను మూసివేయ‌నున్న‌ట్లు హెచ్ఎండీఏ అధికారులు ప్ర‌క‌టించారు. ప‌లు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు కూడా విధిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా గురువారం తెలంగాణ అమ‌రవీరుల స్మార‌క కేంద్రాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న పార్కుల‌ను మూసివేయ‌నున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్‌లను మూసివేయనున్నట్లు చెప్పారు. నెక్లెస్ రోడ్డు, హుస్సేన్ సాగ‌ర్ తీరం, ఐమ్యాక్స్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించ‌నున్నారు.

వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.