విధాత: ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ను నిలిపేయడం సర్వసాధారణం. ప్రధాని మొదలు మంత్రుల వరకు ఎవరి కాన్వాయ్ రోడ్డు పైకి వచ్చినా జనానికి ట్రాఫిక్ కష్టాలు షరా మామూలే. అయితే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఈ వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టారు. అసలు ఏం జరిగిందంటే.. ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా స్వరాష్ట్రమైన గుజరాత్కు వెళ్లారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో అహ్మదాబాద్ నుంచి […]
విధాత: ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ను నిలిపేయడం సర్వసాధారణం. ప్రధాని మొదలు మంత్రుల వరకు ఎవరి కాన్వాయ్ రోడ్డు పైకి వచ్చినా జనానికి ట్రాఫిక్ కష్టాలు షరా మామూలే. అయితే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఈ వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టారు.
అసలు ఏం జరిగిందంటే.. ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా స్వరాష్ట్రమైన గుజరాత్కు వెళ్లారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్కు బయలుదేరారు.
అదే సమయంలో ఆయన కాన్వాయ్ వెనుక ఓ అంబులెన్స్ వస్తున్న విషయాన్ని ప్రధాని గ్రహించారు. వెంటనే తన కాన్వాయ్ను రోడ్డు పక్కగా నిలిపివేయించి, అంబులెన్స్కు దారి ఇచ్చారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాత తిరిగి బయలుదేరారు. ప్రధాని చేసిన పనికి పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.