అభ్యర్థులు ఎవరి మాటలూ నమ్మొద్దు ఈ నెల 8నుండి జనవరి 04 వరకు పరీక్షలు . హాజరు కానున్న 26,433 మంది అభ్యర్థులు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు ఈ నెల 8 తేదీ నుంచి జనవరి 4 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని మేకల అభినయ్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ […]
విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు ఈ నెల 8 తేదీ నుంచి జనవరి 4 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని మేకల అభినయ్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.
ఈ పరీక్షలకు మొత్తం 26,433 మంది అభ్యర్ధలు అర్హత పొందగా, వీరిలో మహిళా అభ్యర్థులు 4,830 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అభ్యర్థులకి ఎక్కడ ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావులేకుండా దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించే గ్రౌండ్ మొత్తం సి.సి కెమెరాల నిఘా పెట్టామన్నారు.
మాయమాటలు నమ్మి మోసపోవద్దు..
అభ్యర్థులు ఎవరు చెప్పినా మాయమాటలు నమ్మొద్దని, పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీకు ఉద్యోగం వచ్చేవిధంగా సహాయం చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని తెలిపారు.
ప్రతీ అంశం హై టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని, ట్రాన్స్పరెంట్గా నిర్వహిస్తున్నామని, ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా అభ్యర్థలకి ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావులేకుండా R.F.I.D ( radio frequency identification reader) ద్వారా నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతీ బ్యాచ్ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతీ అంశం సి.సి కెమెరాల్లో రికార్డు అవుతుందని, దాన్ని భద్రపరుస్తామని, భవిష్యత్తులో ఏవైనా విమర్శలు వస్తే సి.సి పుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని పేర్కొన్నారు. వేలిముద్రలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థుల్ని గ్రౌండ్లోకి అనుమతిస్తారని తెలిపారు. .
అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు
పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వారు జారీ చేసిన అనుమతి లేదా సమాచార పత్రం ( admit card / intimation letter ) తమ వెంట తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
అభ్యర్థి స్వీయ సంతకముతో కూడిన పార్టు 2 అప్లికేషన్ ఫామ్, తమ స్వీయ సంతకాలతో కూడిన కుల ధ్రువీకరణ పత్రం నకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు వెంట తీసుకు రావాలి.
అభ్యర్థి స్వీయ సంతకము కలిగిన మాజీ సైనిక దృవ పత్రం ( PPT / డిచార్జీ బుక్ ) /నో అబ్జెక్షన్ సర్టిఫికేటు ( ఇంకా సర్వీసు నుండి డిచార్జీ కానివారికి), అభ్యర్థి స్వీయ సంతకముతో కూడిన ఏజన్సీ ఏరియా సర్టిఫికేటు ఫర్ ఆదివాసి, షెడ్యూల్డు తెగ G.O. MS 24, ట్రైబల్ వెల్ఫేర్ ( LTR 1) డిపార్టుమెంటు తేది: 12-06-2018 ప్రకారంగా జారీచేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు.
అభ్యర్థులు వారికి ఉద్దేశించిన తేదీలలో మాత్రమే శారీరక, దేహ దారుఢ్య పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు పరీక్ష నిర్వహణ కేంద్రంలోకి ప్రవేశించిన తరువాత అన్నిరకాల పరీక్షలు ముగిసిన తరువాతనే బయటకు అనుమతిస్తారు. కావున అభ్యర్థులు అందుకు తగిన విధంగా సంసిద్ధులై రావాలని తెలిపారు.
అభ్యర్థులు తమ వెంట దుస్తులు ఆహార పానీయాలు వంటి అత్యవసరమైనవి మినహా ఎటువంటి విలువైన లేదా నిషేదిత వస్తువులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రతీ ఈవెంట్, పరిశీలన కేంద్రాల వద్ద ఓర్పుతో ” క్యూ ” పద్ధతిని పాటించాలన్నారు.
సెల్ ఫోన్లు , ఎటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబడవన్నారు. మహిళా అభ్యర్థులు తమ వాస్తవిక ఎత్తును ప్రభావితం చేయు ఎలాంటి అభ్యంతరకర శిరోజాలం మరియు గాజులు ధరించి పరీక్షకు హాజరు కారాదన్నారు.
బయోమెట్రిక్ పద్ధతిలో అభ్యర్థుల పరిశీలన ఉన్నందున చేతి వేళ్లకు గోరింటాకు లేదా ఇతర రంగులు వేసుకుని రాకూడదన్నారు. పరీక్ష నిర్వహణలో ప్రతీ అభ్యర్థి అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని ఎస్పీ సూచించారు.