‘లోక్‌­సభ’కు ముందే రాజ­కీయ రణం!. కత్తులు దూస్తున్న అధి­కార, ప్రతి­పక్ష పార్టీలు

లోక్‌­సభ ఎన్ని­కలు సమీ­పి­స్తున్న వేళ తెలం­గాణ రాజ­కీ­యాలు వేస­వికి ముందే వేడి పుట్టి­స్తు­న్నాయి.

‘లోక్‌­సభ’కు ముందే రాజ­కీయ రణం!. కత్తులు దూస్తున్న అధి­కార, ప్రతి­పక్ష పార్టీలు

కత్తులు దూస్తున్న అధి­కార, ప్రతి­పక్ష పార్టీలు

నాటి బీఆ­రెస్‌ సర్కార్‌ అక్ర­మా­లపై విచా­ర­ణలు,

ఆ పార్టీ నుంచి కాంగ్రె­స్‌­లోకి నేతల వల­సలు

డబుల్‌ స్ట్రాట­జీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దూకుడు

అధి­కార కాంగ్రె­స్‌పై మాజీ సీఎం కేసీ­ఆర్ కృష్ణాస్త్రం

ప్రాజె­క్టుల అప్ప­గిం­తపై రాజ­కీయ సెగలు

విధాత: లోక్‌­సభ ఎన్ని­కలు సమీ­పి­స్తున్న వేళ తెలం­గాణ రాజ­కీ­యాలు వేస­వికి ముందే వేడి పుట్టి­స్తు­న్నాయి. ప్రాజె­క్టులు, భూ దందాలు, ప్రభుత్వ పథ­కాల ముసు­గులో మాజీ సీఎం కేసీ­ఆర్ కుటుంబం, ఆనాటి బీఆ­రెస్ మంత్రులు భారీ అక్ర­మా­లకు పాల్ప­డ్డా­రంటూ.. వారి చర్య­లపై రేవం­త్‌­రెడ్డి ప్రభుత్వం విచా­ర­ణ­లకు ఆదే­శి­స్తు­న్నది. అసెంబ్లీ ఎన్ని­కల్లో ఓడి­పో­యిన బీఆ­రెస్‌.. మళ్లీ లోక్‌­సభ ఎన్ని­కల్లో పుంజు­కో­కుండా పక్కా వ్యూహాన్ని అమలు చేస్తు­న్నట్టు కని­పి­స్తు­న్నది. మరో­వైపు పెద్ద­పల్లి బీఆ­రెస్‌ ఎంపీ వెంక­టేశ్ నేత వంటి వారిని చేర్చు­కో­వ­డం­తో­పాటు పలు­వురు బీఆ­రెస్‌ ఎమ్మె­ల్యే­లను టచ్‌లో పెట్టు­కున్న కాంగ్రెస్‌.. తమ ప్రభు­త్వాన్ని పడ­గొ­డ­తా­మన్న బీఆ­రెస్ నేత­లకు బహు­ముఖ వ్యూహా­లతో గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేం­దుకు పావులు కదు­పు­తు­న్నది. లోక్‌­సభ ఎన్ని­కలే టార్గె­ట్‌గా సీఎం రేవం­త్‌­రెడ్డి ఇంద్ర­వెల్లి సభతో ఎన్ని­కల ప్రచార శంఖా­రావం పూరిం­చారు. ఇదే సమ­యంలో ప్రతి­పక్ష నేత కేసీ­ఆర్ తమపై సంధిం­చిన కృష్ణా ప్రాజె­క్టుల అప్ప­గింత వివా­దాన్ని రేవంత్ ప్రభుత్వం ఘాటుగా తిప్పి­కొ­ట్టేం­దుకు ప్రయ­త్నిం­చింది. ప్రాజె­క్టు­లను కేఆ­ర్‌­ఎం­బీకి అప్ప­గిం­చడం కేసీ­ఆర్‌ నిర్వా­క­మే­నంటూ బీఆ­రెస్ ప్రభుత్వ హయాం నాటి ఒప్పం­దా­లను బయ­ట­పె­ట్టిన ముఖ్య­మంత్రి రేవం­త్‌­రెడ్డి.. అసెం­బ్లీలో చర్చకు రావా­లని సవాల్ చేసి సేఫ్‌­సై­డ్‌లో నిలి­చారు. అటు సీఎం రేవం­త్‌­రె­డ్డికి, మంత్రు­లకు ప్రాజె­క్టు­లపై అవ­గా­హన లేదన్న కేసీ­ఆర్‌ వ్యాఖ్య­లపై డిప్యూటీ సీఎం ఘాటైన సెటైర్లు సంధిం­చారు. తమకు ప్రాజె­క్టు­లపై అవ­గా­హన ఉంది కాబట్టే శ్రీశైలం, సాగర్‌, శ్రీశైలం వంటి భారీ ప్రాజె­క్టులు నిర్మిం­చా­మని, కేసీ­ఆ­ర్‌కు అవ­గా­హన లేకనే కాళే­శ్వరం కుంగి­పో­యిం­దని ఎద్దేవా చేశారు. అంతే­గాక కృష్ణా నదీ జలాల్లో తెలం­గాణ హక్కుల పరి­ర­క్షణ పోరాటం పేరుతో నల్ల­గొం­డలో ఈ నెల 13న నిర్వ­హిం­చ­నున్న కేసీ­ఆర్‌ బహి­రంగ సభకు అను­మ­తిని ఇవ్వ­రా­దని కూడా రేవంత్ ప్రభుత్వం ఆలో­చ­నగా కని­పి­స్తు­న్నది. గతంలో కేసీ­ఆర్ అధి­కా­రంలో ఉన్న­ప్పుడు ప్రతి­ప­క్షా­లపై అణి­చి­వే­తకు పాల్ప­డ్డా­డని, ఇప్పుడు ప్రతి­పక్ష నేతగా రాజ­కీయ ప్రయో­జ­నా­లతో ప్రభు­త్వంపై దుష్ప్ర­చారం కోసం ఆయన నిర్వ­హించే సభ­లకు ఎందుకు అను­మ­తి­ని­వ్వా­లన్న అభి­ప్రా­యాన్ని కాంగ్రెస్‌ నాయ­కులు వ్యక్తం చేస్తు­న్నారు. నల్ల­గొం­డలో నెల రోజు­ల­పాటు సభలు, ర్యాలీ­లకు అను­మ­తు­లను నిషే­ధిస్తూ పోలీ­స్‌­శాఖ ఉత్త­ర్వులు జారీ చేయడం ఇందులో భాగ­మే­నన్న వాదన విని­పి­స్తు­న్నది. అను­మ­తుల నిరా­క­రణ నేప­థ్యంలో కేసీ­ఆర్ నల్ల­గొండ సభ నిర్వా­హణ ప్రశ్నా­ర్థ­కంగా మారింది.

అసెం­బ్లీలో చర్చకు రమ్మంటే నల్ల­గొం­డలో సభ ఎందుకో!

కృష్ణా ప్రాజె­క్టు­లను కేఆ­ర్‌­ఎం­బీకి అప్ప­గిం­చిన వివా­దంపై సీఎం రేవం­త్‌­రెడ్డి అసెం­బ్లీలో ఎన్ని­గం­టల చర్చ­కైనా సిద్ధ­మని ప్రక­టిం­చారు. ఈ నెల 8నుంచి అసెంబ్లీ సమా­వే­శాలు నిర్వ­హిం­చ­నుం­డగా ప్రాజె­క్టుల వివా­దంపై చర్చకు సిద్ధ­మ­వ్వా­ల్సిన బీఆ­రెస్ నేతలు అనూ­హ్యంగా పక్కా రాజ­కీయ వ్యూహంతో ఈ నెల 13న నల్ల­గొండ సభను ప్రక­టిం­చా­రని అంటు­నారు. ప్రజా­క్షే­త్రంలో పోరా­టం­తో­పాటు అసెంబ్లీ వేది­కగా చర్చలో ప్రభుత్వ వైఖ­రిని ప్రశ్నిం­చా­లన్న బీఆ­రెస్ వ్యూహాన్ని పసి­గ­ట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా­గైన బీఆ­రెస్ సభను భగ్నం చేయ­డంతో పాటు అసెంబ్లీ వేది­కగా బీఆ­రెస్ దాడిని తిప్పి­కొ­ట్టేం­దుకు కస­రత్తు చేస్తు­న్న­దని సమా­చారం. దక్షిణ తెలం­గా­ణను ఎడా­రిగా మార్చి, నల్ల­గొండ, మహ­బూ­బ్‌­న­గర్ ప్రాజె­క్టు­లను పదే­ళ్ల­పాటు పడ­కే­యిం­చిన కేసీ­ఆర్ నల్ల­గొం­డకు వస్తే తరి­మి­కొ­డు­తా­మంటూ ఇప్ప­టికే జిల్లా మంత్రి కోమ­టి­రెడ్డి వెంక­ట్‌­రెడ్డి ప్రక­టిం­చారు. ఈ సంద­ర్భంగా జరిగే పరి­ణా­మా­లకు మాది బాధ్యత కాదని హెచ్చ­రిం­చారు. దీంతో శాంతి­భ­ద్ర­తల సమస్య నేప­థ్యంలో పోలీస్ ఆంక్షలు అమ­లు­లోకి తెచ్చి, కేసీ­ఆర్ నల్ల­గొండ సభకు చెక్ పెట్టేం­దుకు ప్రభుత్వం ప్రయ­త్ని­స్తు­న్న­దనే అభి­ప్రా­యాలు వ్యక్త­మ­వు­తు­న్నాయి.

మళ్లీ దిక్క­యిన ఉద్యమ ట్యాగ్‌­లైన్ 

అసెంబ్లీ ఎన్ని­కల్లో ఓటమి పిదప తన పార్టీ కార్యా­లయం తెలం­గాణ భవ­న్‌కు తొలి­సా­రిగా వచ్చిన కేసీ­ఆర్ కాంగ్రె­స్‌పై దాడికి తనకు గతంలో అచ్చొ­చ్చిన తెలం­గాణ హక్కుల రాగాన్నే అందు­కు­న్నారు. కృష్ణా ప్రాజె­క్టుల అప్ప­గింత వివా­దమే అస్త్రంగా కాంగ్రెస్ ప్రభు­త్వాన్ని ఇర­కా­టం­లోకి నెట్టడం, దానితో లోక్‌­సభ ఎన్ని­కల గండాన్ని దాటడం అనేది కేసీ­ఆర్‌ వ్యూహంగా కని­పి­స్తు­న్న­దని రాజ­కీయ విశ్లే­ష­కులు అంటు­న్నారు. ఈ క్రమం­లోనే తెలం­గాణ ఉద్యమ ట్యాగ్‌­లై­న్‌­లోని నీళ్ల అంశాన్ని తీసు­కుంటూ.. ‘మా నీళ్లు మాకే.. మా ప్రాజె­క్టులు మాకే..’ అంటూ మరో ఉద్య­మా­నికి సిద్ధ­మ­య్యా­రని చెబు­తు­న్నారు. కృష్ణా ప్రాజె­క్టు­లను కేఆ­ర్‌­ఎం­బీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్ప­గించి రాష్ట్ర ప్రయో­జ­నా­లను కేంద్రా­నికి తాకట్టు పెట్టిం­దంటూ కృష్ణా­స్త్రాన్ని రేవంత్ సర్కా­ర్‌పై కేసీ­ఆర్ సంధిం­చారు. కృష్ణా నదీ జలా­లపై తెలం­గాణ హక్కు­లను కాపా­డు­కో­వడం కోసం ఎంత­కా­డి­కైనా పోరా­డు­తా­మని ప్రక­టిం­చారు. ఎన్ని అడ్డం­కు­లె­దు­రైనా ఈ నెల 13న నల్ల­గొం­డలో బహి­రంగ సభ నిర్వ­హి­స్తా­మని చెబుతూ రేవంత్‌ ప్రభు­త్వంపై సమ­ర­భేరి మోగిం­చారు. చిత్రంగా అసెంబ్లీ ఎన్ని­కల వేళ దేశా­నికే తెలం­గాణ సంక్షేమ పథ­కాలు ఆద­ర్శ­మన్న ప్రచారం కాస్తా లోక్‌­సభ ఎన్ని­కల ప్రచా­రా­నికి వచ్చే­స­రికి వెను­క­బ­డి­పోగా, తెలం­గాణ ఉద్యమ నినా­ద­మైన ‘మా నీళ్లు మాకే..’, ‘తెలం­గాణ హక్కుల సాధన’ అన్న సెంటి­మెంట్ నినా­దాలే మళ్లీ కేసీ­ఆ­ర్‌కు దిక్క­వ్వడం చర్చ­నీ­యాం­శంగా మారింది.