500నోటుపై రాముడి ఫోటో ముద్రించాలి : రాజాసింగ్

అయోధ్య నూతన రామ మందిరం లో విగ్రహ ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు

500నోటుపై రాముడి ఫోటో ముద్రించాలి : రాజాసింగ్

విధాత: అయోధ్య నూతన రామ మందిరం లో విగ్రహ ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర శంబాజీ పూర్ లో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాల కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు.



 


ఇండోనేషియాలో 80 శాతం ముస్లింలు ఉన్నారని రాజా సింగ్ వివరించారు. మన దేశంలో రూ.500 నోటుపై రాముడి ప్రతిరూపం ముద్రించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.500 నోటుపై శ్రీరాముడి ఫొటో ముద్రించాలని తన ఒక్కడి డిమాండ్ కాదని, 100 కోట్ల మంది హిందువుల అభిప్రాయన్నారు.


మహారాష్ట్రలో 10 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పేరుతో ఉందని వివరించారు. 2009 వరకు 4 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉండేదన్నారు. అది క్రమంగా 10 లక్షల ఎకరాల వరకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూములను మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాజా సింగ్ కోరారు. లేదంటే కోర్టులో పిటిషన్ వేస్తామని హెచ్చరించారు.



 


దేశంలో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములను విడుదల చేయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. దేశ విభజన సమయంలో ఇక్కడి జనాలను హతమార్చిన వారి ఆస్తులను కాపాడేందుకు నెహ్రూ ప్రభుత్వం వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందని విమర్శించారు.