SIT, TSPSC విధాత: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది. విచారణలో భాగంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నది. మరోసారి కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టారు. 100 పైగా మార్కులు వచ్చిన అభ్యర్థుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన అధికారులు.. అవసరమైతే మరోసారి రావాలని సూచించారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టుకాగా.. వారిలో 6 గురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన అధికారులు విచారణలో కీలక వివరాలు రాబట్టారు. నాంపల్లి కోర్టు ఆదేశాల […]
SIT, TSPSC
విధాత: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది. విచారణలో భాగంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నది. మరోసారి కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టారు. 100 పైగా మార్కులు వచ్చిన అభ్యర్థుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన అధికారులు.. అవసరమైతే మరోసారి రావాలని సూచించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టుకాగా.. వారిలో 6 గురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన అధికారులు విచారణలో కీలక వివరాలు రాబట్టారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్రెడ్డి, డాక్యా నాయక్, రాజేందర్ నాయక్లను మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు.
చంచల్గూడ జైలు నుంచి నిందితులను నేరుగా సిట్ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారిని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో తన భర్తను తీవ్రంగా హిస్తున్నారంటూ.. రాజశేఖర్రెడ్డి భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఆ కేసు విచారణలో భాగంగా నిందితులకు 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలన్న కోర్టు సూచనల మేరకు కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించి మరోసారి విచారించారు. మరో రెండు రోజుల పాటు నిందితులను అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్లో అధిక మార్కులు వచ్చిన వారిపై కూడా అధికారులు దృష్టి సారించారు. సర్వీస్ కమిషన్ నుంచి 100 పైగా మార్కులు వచ్చిన అభ్యర్థుల వివరాలు అధికారులు సేకరించారు. ఆ అభ్యర్థులతో ఒక జాబితా తయారుచేశారు. గ్రూప్ -1లో 100 పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఫోన్ చేసి వారి వివరాలు తెలుసుకున్నారు.
మరికొందరని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. వచ్చిన సుమారు 20 మంది అభ్యర్థుల విద్యార్హతలు, ప్రస్తుత వారు చేస్తున్న ఉద్యోగం సహా, గత పోటీ పరీక్షల్లో వచ్చిన మార్కులపై ఆరా తీస్తున్నారు. ఎలా ప్రిపేర్ అయ్యారు. ఎన్నేళ్ల నుంచి చదువుతున్నారు అని అధికారులు ప్రశ్నించారు.
స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటివరకు చదివిన వివరాలన్నీ అడిగినట్టు అభ్యర్థులు తెలిపారు. నిజాయితీగా రాయని అభ్యర్థుల గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని విచారించడం సరైన విధానమేనని అభ్యర్తులు చెప్పారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని పోలీసులు చెప్పినట్టు అభ్యర్థులు తెలిపారు.