జూన్ 15లోగా కార్యాలయం ఖాళీ చేయండి.. ఆప్కు సుప్రీంకోర్టు ఆదేశం
దేశంలో లోక్సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలోని ఆప్ కార్యాలయాన్ని జూన్ 15లోగా ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది

న్యూఢిల్లీ : దేశంలో లోక్సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలోని ఆప్ కార్యాలయాన్ని జూన్ 15లోగా ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. పార్టీ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చాలని ఆదేశించింది. ప్రస్తుత ప్రదేశంలో కొనసాగే హక్కు లేదని పేర్కొంది. పార్టీ కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ స్థలం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది.
4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఒక రాజకీయ పార్టీ అక్కడ ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తుందని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలు అన్నిటిని తొలగిస్తామని పేర్కొన్నది. ప్రజలకు ఉపయోగపడే భూమిని హైకోర్టుకు తిరిగి స్వాధీనం చేయాలని ఆదేశించింది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని నిర్ధారించేందుకు తదుపరి వాయిదాలోగా ఢిల్లీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హైకోర్టు రిజిస్టారు జనరల్ సమావేశం కావాలని పేర్కొన్నది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ మనోజ్ మిత్రాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది