Suryapet | సమర భేరి సభను మరిపించేలా.. సూర్యాపేట ప్రగతి నివేదన సభ
Suryapet | రెండు లక్షల మందితో బహిరంగ సభ వర్షం వచ్చినా సభకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు సభ ప్రాంగణం చేరువ వరకు వచ్చేలా పార్కింగ్ వసతులు సీఎం సభకు మద్దతుగా గ్రామాలలో తీర్మానాలు స్వతహాగా ఏర్పాట్లు చేసుకుంటున్న రైతాంగం మీటింగ్ కు తరలి వచ్చేందుకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు సిద్ధం చేసుకుంటున్న వైనం నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి విధాత: సూర్యాపేటలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం […]

Suryapet |
- రెండు లక్షల మందితో బహిరంగ సభ
- వర్షం వచ్చినా సభకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు
- సభ ప్రాంగణం చేరువ వరకు వచ్చేలా పార్కింగ్ వసతులు
- సీఎం సభకు మద్దతుగా గ్రామాలలో తీర్మానాలు
- స్వతహాగా ఏర్పాట్లు చేసుకుంటున్న రైతాంగం
- మీటింగ్ కు తరలి వచ్చేందుకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు సిద్ధం చేసుకుంటున్న వైనం
- నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: సూర్యాపేటలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం సూర్యాపేట నియోజకవర్గం తో పాటు యావత్ జిల్లా ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న పార్టీ కార్యాలయం, మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, సభా స్థలిని పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి… ఉద్యమ సమయంలో సూర్యాపేటలో ప్రజలను ఉవ్వెత్తున చైతన్య పరిచిన సమరభేరీ సభను మించి 20న జరుగనున్న ప్రగతి నివేదన సభ జరుగ బోతుందని పేర్కొన్నారు. రెండు లక్షల మందితో జరుగబోయే సభ వర్షం కురిసినా ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. సభా స్థలి వద్దకు నేరుగా చేరుకునే విధంగా పార్కింగ్ వసతులు కల్పిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
సీఎం సభకు మద్దతుగా గ్రామాలలో తీర్మానాలు
పరాయి పాలనలో దగా పడిన తమ బతుకులను బాగు చేసిన అభివృద్ధి ప్రదాత, తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు… కేసీఆర్ కు మద్దతుగా గ్రామాలకు గ్రామాలు తీర్మానాలు చేస్తున్నారు. తామంత కేసీఆర్ వైపు అంటూ, తమ బతుకులను ఆగం చేసే పార్టీలు మాకు వద్దంటూ కేసీఆర్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. సభకు స్వచ్ఛందంగా తరలిరావడానికి ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ను సిద్ధం చేసుకుంటున్నారు.
లక్ష రూపాయల రుణమాఫీ తర్వాత సీఎం కేసీఆర్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ సూర్యాపేటనే. రైతు రుణమాఫీ చేయడంతో పాటు, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన తమ అభిమాన ముఖ్యమంత్రిని చూడడానికి ఆయన మాటలు వినడానికి రైతులంతా తనకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
నలువైపులా అభివృద్ధి..
కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు సిద్ధమవుతున్న పట్టణ ప్రజానీకం 2014 ముందు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా, సూర్యాపేట జిల్లా చేసిన కేసీఆర్ ఆ తర్వాత మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, నూతన ఎస్పీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులను తేవడంతో పాటు కాళేశ్వరం జలాలు తెచ్చి సూర్యాపేట ను అగ్ర భాగాన ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.