గ్రేటర్‌లో బీఆరెస్‌కు వరుస షాక్‌లు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆరెస్‌ మరో షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు

గ్రేటర్‌లో బీఆరెస్‌కు వరుస షాక్‌లు
విధాత, హైద­రా­బాద్‌ : ఉమ్మడి రంగా­రెడ్డి జిల్లాలో బీఆ­రెస్‌ మరో షాక్‌ తగి­లింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా­రెడ్డి, ఆయన కోడలు జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అని­తా­రెడ్డి కాంగ్రె­స్‌లో చేరేం­దుకు సిద్ధ­మ­య్యారు. ఇప్ప­టికే వారు సీఎం రేవం­త్‌­రె­డ్డిని కలిసి తమ చేరి­కపై సంప్ర­దిం­పులు చేశారు. మహే­శ్వరం నియో­జ­క­వ­ర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా­రె­డ్డితో విబే­ధాల నేపథ్యంలో తీగల బీఆ­రె­స్‌ను వీడి కాంగ్రె­స్‌లో చేరేం­దుకు నిర్ణ­యిం­చు­కు­న్నార‌ని తెలుస్తున్న‌ది. ఇప్ప­టికే గ్రేట­ర్‌లో మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసి­యుద్దీన్ కాంగ్రె­స్‌లో చేరి­పోగా, తాజాగా ప్రస్తుత డిప్యూటీ మే­యర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు. వారు కూడా కాంగ్రె­స్‌లో చేర‌నున్నార‌ని తెలుస్తున్న‌ది. ఆమె సికిం­ద్రా­బాద్‌ ఎంపీ టికెట్‌ ఆశి­స్తు­న్నారు.
అటు మాజీ మేయర్‌, బీఆ­రెస్‌ నేత బొంతు రామ్మోహ‌న్‌ సైతం సీఎం రేవం­త్‌­రె­డ్డిని కలిసి కాంగ్రె­స్‌లో చేరే విష­యమై చర్చిం­చార‌నే వార్త‌లు షికారు చేస్తున్నాయి. సికిం­ద్రా­బాద్ లేదా మల్కా­జి­గిరి ఎంపీ టికె­ట్లను ఆయన ఆశి­స్తు­న్నారు. అటు మాజీ మంత్రి, బీఆ­రెస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేం­ద­ర్‌­రెడ్డి, ఆయన భార్య, వికా­రా­బాద్ జడ్పీ ఛైర్‌­ప­ర్సన్ సునీతా మహేం­దర్ రెడ్డి సైతం తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలి­శారు. కాంగ్రెస్‌ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్‌ హామీతో పట్నం కాంగ్రె­స్‌లో చేరేం­దుకు సిద్ధ­మ­య్యా­రని ప్రచారం విని­పి­స్తు­న్నది. జీహె­చ్‌­ఎంసీ పరి­ధి­లోని బీఆ­రె­స్‌కు చెందిన 20మంది కార్పొరేట‌ర్ల‌ వరకు హస్తం గూటికి వెళు­తా­రన్న ప్రచారం తెర­వె­నుక బలంగా సాగు­తు­న్నది.