DHARANI, COLLECTOR, RDO, TAHSILDAR, REVENUE DEPARTMENT, CMO, CM KCR, DECENTRALIZATION, CCLA ధరణిపై వస్తున్న వ్యతిరేకతను అధిగమించడం ఎలా! ఏమి చేస్తే ధరణి సమస్యలు పరిష్కారం అవుతాయి సమాలోచనలు చేస్తున్న తెలంగాణ సర్కారు విధాత: రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ(DECENTRALIZATION) దిశగా సర్కారు కసరత్తు చేస్తోందా? అన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి. కింది స్థాయిలో రెవెన్యూ శాఖ అధికారులకు ఉన్న అధికారాలన్నింటినీ రద్దు చేసిన సర్కారు.. తిరిగి పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. ధరణి పోర్టల్ను […]
DHARANI, COLLECTOR, RDO, TAHSILDAR, REVENUE DEPARTMENT, CMO, CM KCR, DECENTRALIZATION, CCLA
విధాత: రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ(DECENTRALIZATION) దిశగా సర్కారు కసరత్తు చేస్తోందా? అన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి. కింది స్థాయిలో రెవెన్యూ శాఖ అధికారులకు ఉన్న అధికారాలన్నింటినీ రద్దు చేసిన సర్కారు.. తిరిగి పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. ధరణి పోర్టల్ను సీఎం కేసీఆర్ ప్రారంభించి రెండేళ్లు దాటింది. ఈ రెండేళ్లలో రైతుల భూమి సమస్యలు(LAND ISSUES) పరిష్కారం కాకపోగా జటిలం అయ్యాయి. భూమి క్రయవిక్రయాలు, మ్యుటేషన్ మినహా మిగతా సమస్యలు అపరిష్కృతంగా మిగిలాయి.
ఒక రైతు భూమి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితులు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చాయి.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడటానికి రైతుల సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించడమే ఏకైక మార్గమన్న నిర్ణయానికి సర్కారు వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో రైతులు తహసీల్దార్ను కలిసి సమస్య పరిష్కరించుకోవడానికి వీలుగా అధికారాలను వికేంద్రీకరించాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల (District collectors) చేతిలో పెట్టిన అధికారాలలో కొన్నింటిని తాసీల్దార్లకు (THASILDARS), మరి కొన్నింటిని ఆర్డీఓ(RDO)లకు బదలాయించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ధరణి (DHARANI)పై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న కొందరు రైతులు దీనిని తమకు పట్టిన దరిద్రంగా అభివర్ణిస్తున్నారు. ధరణి ద్వారా తాము సమస్యలు పరిష్కారం చేయలేమని, ఆ బాధ్యత కలెక్టర్లదేనని చెపుతూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఎవరైనా నిజంగా పరిష్కరిద్దామని ప్రయత్నించినా అవకాశం లేక పోవడంతో తాము ఏమీ చేయలేమని సమాధానం ఇస్తున్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రులకు అనేకమంది ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పైగా ధరణితో అద్భుతాలు జరిగాయని ప్రభుత్వం చెప్పుకొంటున్నది. కానీ దీనికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉంది. దీనిని గుర్తించిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించింది. దీనినే ప్రధాన ప్రచార అస్ర్తంగా ఆ పార్టీ తీసుకున్నది.
అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి వరకు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరు చెప్పినా పట్టించుకోని CM KCR తాజాగా దీనిపై కాస్త దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏమి చేస్తే ధరణి సమస్యలు తొలుగుతాయో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ధరణి పరిష్కార బాధ్యత మిట్టల్కు?
గతంలో CSగా పని చేసిన SOMESH KUMAR రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా చూశారు. ఆయన తీసుకు వచ్చిన ధరణిలో ఎలాంటి సమస్యలు లేవని CM KCR వద్ద ప్రొజెక్ట్ చేశారు. దీంతో సీఎం కేసీఆర్ ఎవరి మాట వినేవారు కాదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. పైగా ఉన్న సమస్యలను ఆయన వద్ద ఎవరూ వివరించే పరిస్థితి లేదని అంటున్నారు. దీంతో ధరణి సమస్యలు అలాగే మిగిలి పోయాయి. ధరణిపై CABINET SUB COMMITTEE ఇచ్చిన రిపోర్ట్ కూడా పట్టించుకోని పరిస్థితి నాడు ఏర్పడిందంటారు. ఈలోపు సీఎస్ సోమేశ్ కుమార్ హైకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణను విడిచి వెళ్లారు.
దీంతో నూతన సీఎస్గా శాంతికుమారిని సీఎం నియమించారు. సుదీర్ఘ కాలం తర్వాత రెవెన్యూ శాఖకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించారు. అతనికే సీసీఎల్ఏగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూశాఖ బాధ్యతలు తీసుకున్న సీనియర్ IAS OFFICER NAVEEN MITTALకు రైతుల్లో ధరణిపై వచ్చిన వ్యతిరేకతను పోగొట్టే బాధ్యత అప్పగించినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రజల్లో ధరణిపై సానుకూలత రావాలంటే ఏమి చేస్తే బాగుంటుందో చెపితే దానిపై నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు అనుకుంటున్నారు.
‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదు.. సవరణో, రద్దు చేయడమో పరిష్కారం కాదు
రంగంలోకి మిట్టల్
రెవెన్యూ బాధ్యతలు స్వీకరించిన నవీన్ మిట్టల్ ధరణి కష్టాల నుంచి ఏ విధంగా బయట పడాలన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మిట్టల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. యాదాద్రితో పాటు పలు జిల్లాల్లో ఆయన పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇప్పటికే పలుసార్లు రెవెన్యూ శాఖ అధికారులు, సీసీఎల్ఏ (CCLA) అధికారులతో సమీక్షలు నిర్వహించినట్లు సమాచారం.
ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన తరువాత క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించే అధికారం తాసీల్దార్లకు లేకుండా పోయింది. ప్రతి చిన్న సమస్యను కూడా కలెక్టర్ మాత్రమే పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక సమస్యలకు ఇదే మూల కారణం అయిందని, అధికారాలను వికేంద్రీకరిస్తేనే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని, రైతుల నుంచి వ్యతిరేకత తగ్గుతుందని సూచనలు చేసినట్లు తెలిసింది.
దీంతో చట్టంలో ఎలాంటి సవరణలు చేయకుండా అధికారాలు వికేంద్రీకరించడానికి వీలున్న అంశాలు ఏమిటన్న దానిపై కూడా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల భూమి సమస్యలపై ఉన్నతాధికారులకు వివరించినట్టు తెలుస్తున్నది. క్షేత్ర స్థాయిలో అధికారులు చెపుతున్న అంశాలు, ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న సిఫారసులు, రైతులు ఎదుర్కొంటు న్న సమస్యలన్నింటినీ పరిశీలించి, సమీక్షించి ఒక నిర్ణయానికి రావాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.