Nandamuri Balakrishna | నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన వీర సింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో నిర్వహించిన సంగతి తెలిసిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీరసింహారెడ్డి ట్రైలర్ విడుదల చేశారు. ఇక బాలయ్య డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ కొనసాగుతోంది. సంతకాలు పెడితే బోర్డు మీద […]
Nandamuri Balakrishna | నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన వీర సింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో నిర్వహించిన సంగతి తెలిసిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీరసింహారెడ్డి ట్రైలర్ విడుదల చేశారు.
ఇక బాలయ్య డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ కొనసాగుతోంది. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరు ఎక్కువ అని బాలయ్య డైలాగులు విసిరారు.
ఈ డైలాగులు సీఎం జగన్ను ఉద్దేశించే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చుతూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొని.. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరని బాలయ్య బాబు డైలాగ్ పేల్చారని టాక్ వినిపిస్తోంది. పదవుల విషయంలోనూ జగన్ను పరోక్షంగా బాలయ్య హెచ్చరించారని నెటిజన్లు అనుకుంటున్నారు. పదవులతో వచ్చే పొగరు మీకు ఉంటే.. నా పుట్టుకతోనే నా డీఎన్ఏకు పొగరు ఎక్కువ అంటూ బాలకృష్ణ గట్టి కౌంటర్ ఇచ్చారని పేర్కొంటున్నారు.