గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

విధాత: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులు అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా అనేక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్కు ప్రతిపాదనలు పంపారని, అయితే గవర్నర్ వాటిని తిరస్కరించినట్లు గుర్త చేశారు. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని, ఆమెకు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
కేసీఆర్కు అనుకూలంగా ఉంటేనే.. గవర్నర్గా వ్యవహరించినట్టా? కేసీఆర్ చేస్తున్న తప్పిదాలు, పొరపాట్లను ఎత్తి చూపుతూ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే.. గవర్నర్గా మీక నచ్చరా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమ కాళ్ల దగ్గర ఉండేవాళ్లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉండాలని కోరుకోవడం సమంజసం కాదని, తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నారు.