మత ప్రాతిపదికన ఓట్లు కోరినందుకు బీజేపీ సిటింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్యపై ఎన్నికల కమిషన్ శుక్రవారం కేసు నమోదు చేసింది
మత ప్రాతిపదిక ఓట్లు అడిగిన ఫలితం
బెంగళూరు: మత ప్రాతిపదికన ఓట్లు కోరినందుకు బీజేపీ సిటింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్యపై ఎన్నికల కమిషన్ శుక్రవారం కేసు నమోదు చేసింది. తన సామాజిక మాధ్యమం ఖాతాలో శుక్రవారం ఉదయం ఒక వీడియోను ఉంచిన సూర్య.. అందులో మతం ఆధారంగా ఓట్లు కోరారని కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి ఎక్స్లో తెలిపారు. బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారీ సంఖ్యలో ఓట్లు వేయడానికి రావాలని పిలుపునిచ్చిన తేజస్వి సూర్య.. అందులో రామ మందిరం, ఆర్టికల్ 370, సరిహద్దు భద్రత వంటి అంశాలను ప్రస్తావించారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.