విగ్రహం పుష్టి,నైవేద్యం నష్టి అన్నట్టుంది ఏపీ ఐటీ శాఖ పరిస్థితి… నారా లోకేష్

ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… విధాత:ఐటీ శాఖ పై జగన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయి.విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు తయారైంది ఏపీ ఐటీ శాఖ పరిస్థితి.డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు శూన్యం.కనీసం రివ్యూ మీటింగ్ కి హాజరైన సలహాదారులన్ని కంపెనీలు కూడా ఈ రెండేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రానికి రాలేదు. టీడీపీ హయాంలో వచ్చిన […]

విగ్రహం పుష్టి,నైవేద్యం నష్టి  అన్నట్టుంది  ఏపీ ఐటీ శాఖ పరిస్థితి…  నారా లోకేష్

ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…

విధాత:ఐటీ శాఖ పై జగన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయి.విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు తయారైంది ఏపీ ఐటీ శాఖ పరిస్థితి.డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు శూన్యం.కనీసం రివ్యూ మీటింగ్ కి హాజరైన సలహాదారులన్ని కంపెనీలు కూడా ఈ రెండేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రానికి రాలేదు.

టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు మా శ్రమ ఫలితమే అని బిల్డప్ ఇచ్చే పనిలో ఐటీ శాఖ మంత్రి గారు బిజీగా ఉన్నారు.కంపెనీలు తీసుకురావడం చేతగాని సలహాదారుల గుంపు టీ,కాఫీలు తాగుతూ కాలం గడిపేస్తున్నారు.కొత్తవి రాకపోగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్నీ బైబై జగన్ అంటున్నాయి.సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా జగన్ రెడ్డి ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపు.