INDvs BAN | టి20 సిరీస్​ను ఘనంగా ఆరంభించిన యంగ్​ ఇండియా – బంగ్లాపై ఘనవిజయం

టి20 సిరీస్​ను ఘనంగా ఆరంభించిన యంగ్​ ఇండియా – బంగ్లాపై ఘనవిజయం అర్షదీప్​ సింగ్​, వరుణ్​ చక్రవర్తిల సూపర్​ బౌలింగ్​లో పరుగులు రాబట్టడమే కష్టంగా మారిన తరుణంలో ఆరు వికెట్లు వారికే సమర్పించుకుని పెవిలియన్​కు క్యూ కట్టింది. భారత కొత్త స్పీడ్​ గన్​ మయాంక్​ యాదవ్​ ఈ మ్యాచ్​ ద్వారా అంతర్జాతీయ రంగప్రవేశం చేసి ఓ వికెట్​ తీసాడు.

INDvs BAN |  టి20 సిరీస్​ను ఘనంగా ఆరంభించిన యంగ్​ ఇండియా – బంగ్లాపై ఘనవిజయం

India-Bangladesh T20 Series: బంగ్లాదేశ్​తో నేడు మొదలైన టి20 సిరిస్​ మొదటి మ్యాచ్​ గ్వాలియర్​(Gwalior)లో జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి వన్డే డబుల్​ సెంచరీ సచిన్​ టెండుల్కర్​ ద్వారా నమోదైన ఈ వేదిక చరిత్ర సృష్టించింది. నేడు ఇదే గ్రౌండ్​లో నెక్స్ట్ జనరేషన్​ టీమ్​ బంగ్లాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి, అలవోక విజయం సాధించింది India win by 7 wickets.

టాస్​ గెలిచి బంగ్లాకు బ్యాటింగ్​ అప్పగించిన భారత్​, సరైన నిర్ణయమే తీసుకుంది. ఆరంభంలోనే నిప్పులు కురిపించిన అర్షదీప్​ సింగ్​ టపాటపా రెండు వికెట్లు నేలకూల్చాడు. ఆర్షదీప్(Arshdeep Singh)​ దెబ్బకు ఓపెనర్లిద్దరూ 14 పరుగులకే డగౌట్​కు చేరారు. ఆ తర్వాత కుదుటపడుతున్నట్టనిపించిన కెప్టెన్​ శాంటోను వాషింగ్టన్​ సుందర్​ అద్భుతమైన రిటర్న్​ క్యాచ్​ ద్వారా అవుట్​ చేయగా, ప్రమాదకర బ్యాటర్​ మహమ్మదుల్లాను ఆరంగేట్ర బౌలర్​ మయాంక్​ యాదవ్​ ఒక్క పరుగుకే ఇంటికి పంపాడు. మిడిలార్డర్​ను స్పిన్నర్​ వరుణ్​ చక్రవర్తి(Varun Chakravarthy) మూడు వికెట్లు తీసి కుప్పకూల్చగా, మెహదీ హసన్​ ఒక్కడే కాస్త పోరాడాడు. మిగతావారిలా వచ్చి అలా వెళ్లారు. భారత బౌలర్లలో అర్షదీప్​, వరుణ్​ చెరో మూడు వికెట్లు తీసుకోగా, మయాంక్​, హార్థిక్​, సుందర్​ తలా ఒక వికెట్​ తీసుకున్నారు.

తదనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత్​కు అభిషేక్​ శర్మ(7 బంతుల్లో 16, 1 సిక్స్​, 2 ఫోర్లు) జెట్​ స్పీడ్​నందించాడు. కానీ, సంజూతో సమన్వయలోపంతో రనౌట్​గా వెనుదిరిగాడు. సంజూతో జతకలిసిన కెప్టెన్​ సూర్య ధనాధన్​ ఇన్నింగ్స్​తో మ్యాచ్​ను ముందుకు నడిపించాడు. వేగం పెంచే క్రమంలో సంజూ(19 బంతుల్లో 29, 6 ఫోర్లు), సూర్య(14 బంతుల్లో 29, 3 సిక్స్​లు, 2ఫోర్లు) ఔటైనా, నితీశ్​కుమార్​ రెడ్డి(15 బంతుల్లో 16, ఒక సిక్స్​​), హార్థిక్​ పాండ్యా(16 బంతుల్లో 39, 2 సిక్స్​లు, 5 ఫోర్లు) మరో వికెట్​ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.  తుదకు భారత్​ 11.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సుడిగాలి ఇన్నింగ్స్​తో పాండ్యా చెలరేగిపోయాడు.  బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్​, మెహదీ హసన్​ చెరో వికెట్​ తీసారు.