టోక్యో ఒలంపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించాలి ..మంత్రి శ్రీనివాస్ గౌడ్
విధాత:హైదరాబాద్ లోని తన నివాసంలో టోక్యో లో జరగనున్న ఒలంపిక్స్ కు మన దేశం నుండి టెన్నిస్ విభాగంలో ఎంపికైన రాష్ట్రానికి చెందిన సానియా మీర్జా తరుపున వారి తండ్రి ఇమ్రాన్ మీర్జా ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ప్రోత్సహకంగా రాష్ట్ర క్రీడా శాఖ తరుపున 5 లక్షల రూపాయల చెక్కును సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా కు స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డితో కలసి అందించారు. ఈ […]

విధాత:హైదరాబాద్ లోని తన నివాసంలో టోక్యో లో జరగనున్న ఒలంపిక్స్ కు మన దేశం నుండి టెన్నిస్ విభాగంలో ఎంపికైన రాష్ట్రానికి చెందిన సానియా మీర్జా తరుపున వారి తండ్రి ఇమ్రాన్ మీర్జా ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ప్రోత్సహకంగా రాష్ట్ర క్రీడా శాఖ తరుపున 5 లక్షల రూపాయల చెక్కును సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా కు స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డితో కలసి అందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడా సదుపాయాల కల్పనకు అనేక ప్రోత్సాహకాలను ప్రకటించారన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు 25 కోట్ల 87 లక్షల రూపాయలను నగదు ప్రోత్సాహకాలను అందించామన్నారు. వివిధ క్రీడా సంఘాలకు 9 కోట్ల రూపాయల ను అందించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ రాష్ట్రం ను క్రీడా హబ్ గా తీర్చిద్దేందుకు కేసీఆర్ క్రీడా పాలసీ తయారీకి, క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీల CSR ఫండ్స్ ద్వారా వివిధ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు ఉన్నత విద్యా లో 0.5 శాతం, ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లు ను అమలు చేస్తున్నామన్నారు. ఒలంపిక్స్, ప్రపంచ ఛాంపియన్స్ షిప్ లలో, కామన్ వెల్త్ లాంటి అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్నీ గతం కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో ఒలంపిక్స్ లో గోల్డ్ సాధించిన క్రీడాకారునికి 50 లక్షలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తున్నామన్నారు, రజత పథకం సాధించిన క్రీడాకారులకు గతంలో 25 లక్షల రూపాయలు ఇస్తే నేడు ఒక కోటి రూపాయల ను అందిస్తున్నామన్నారు. కాంస్య పతకం సాధించిన క్రీడాకారులకు గతంలో 10 లక్షలు ఇస్తే నేడు 50 లక్షల రూపాయల నగదు పురస్కారాలను క్రీడాకారులకు సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందిస్తున్నామన్నారు.
టోక్యో ఒలంపిక్స్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.