ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు
విధాత : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మెజార్టీగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు రఘురాంరెడ్డి గెలుపు కోసం చేస్తున్న ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఇంకోవైపు వారికి తోడుగా రఘురాంరెడ్డి కోడళ్లు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. రఘురాంరెడ్డి పెద్దకోడలు సినీ నటుడు దగ్గుబాటు వెంకటేశ్ కూతురు ఆశిత్ర, రెండో కోడలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూతురు స్వప్నిరెడ్డిలు తమ మామ గెలుపు కోసం విస్తృత ప్రచారం సాగిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత ముందుకు దూకిస్తున్నారు.
రాజకీయాలకు, ఎన్నికల ప్రచారాలకు ఇద్దరు కోడళ్లు కూడా కొత్త అయినప్పటికి, ఏ మాత్రం తడబడకుండా రఘురాంరెడ్డిని ఎందుకు గెలిపించాలో వివరిస్తూ తమ మామను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. వారిని చూసేందుకు, వారి మాటలను వినేందుకు వారి ప్రచార సభలకు ప్రజలు స్వచ్చందంగా తరలివస్తున్నారు. ఇకపోతే వీరికి తోడు రఘురాంరెడ్డి గెలుపు కోరుతూ వియ్యంకుడైన సీని నటుడు వెంకటేశ్ ఈ నెల 7వ తేదీన ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుండటంతో ఖమ్మం కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మరింత జోష్ తీసుకరానుంది.