మద్యం..మజాకా రెండు రోజుల్లో 282 కోట్లు
మీకు తెలుసా❗సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రోజుకు 61 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవి… లాక్ డౌన్ అనగానే రెండు రోజుల్లో 282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి… అంటే ఇంచుమించు 4 ఇంతలు ఎక్కువగా అమ్మకాలు జరిపారు… ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుపుతుండగా… మద్యం ప్రియులు మాత్రం వ్యాక్సిన్ లు.. కోవిడ్ పరీక్షలు కంటే మద్యం కొనుగోలు కే ఎక్కువ మక్కువ చూపుతున్నారన్నది […]

మీకు తెలుసా❗
సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రోజుకు 61 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవి…
లాక్ డౌన్ అనగానే రెండు రోజుల్లో 282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి…
అంటే ఇంచుమించు 4 ఇంతలు ఎక్కువగా అమ్మకాలు జరిపారు…
ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుపుతుండగా…
మద్యం ప్రియులు మాత్రం వ్యాక్సిన్ లు.. కోవిడ్ పరీక్షలు కంటే మద్యం కొనుగోలు కే ఎక్కువ మక్కువ చూపుతున్నారన్నది ఈ రెండు రోజుల మద్యం అమ్మకాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు…
ఉదయం 6 గంటల నుండే మద్యం కొనుగోళ్ల కోసం బారులు తీరుతున్నారు…
మద్యం సిండికేట్ కు కాసుల వర్షం
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అంటే కేవలం 4 గంటలు మాత్రమే మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నాయి…మిగిలిన 20 గంటలు మద్యం దుకాణాలు మూత పడడం తో మద్యం ప్రియులు బెల్టు దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు..
ఒక్కో క్వార్టర్ కు బెల్టు దుకాణం లకు యం.ఆర్.పి కంటే అదనంగా 20 విక్రయించడం తో మద్యం సిండికేట్ కు కాసుల వర్షం కురుస్తుంది..
ఆంధ్రలో బెల్టు దుకాణాల పై ముఖ్యమంత్రి జగన్ కొరడా ఝలిపించారు…
కానీ ..తెలంగాణ లో బార్ లను రెస్టారెంట్ ల ను లాక్ డౌన్ తో మూసి వేశారు కానీ రేయి..పగలు తేడా లేకుండా బెల్టు దుకాణాల ను బార్లా తెరిపించారు..బెల్టు దుకాణాల నియంత్రణ పై ఎటువంటి చర్యలు లేక పోవడం తో గల్లీ గల్లీ లో మద్యం ఏరులై పారుతుంది..24 గంటలు బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయాలు జరుపుతున్నారు ఆయన అధికారులు తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు…
మద్యం ప్రియులు జేబులకు చిల్లు
లాక్ డౌన్ లేని సమయం లో ఓ కూలి వ్యక్తి పొద్దంత పని చేసుకొని ఇంటికి వెళ్లే సమయం లో ఓ క్వార్టర్ సీసా తీసుకొని ఇంటికి వెళ్లి తాగి పడుకునే వారు అప్పుడు ఆ కోటర్ సీసా కే పరిమితం అయ్యే వారు..
ఇప్పుడు లాక్ డౌన్ అమలులో ఉండడం తో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉండడం తో ఉదయం ఓ కోటరు కొనుగోలు చేసి మధ్యాహ్నం కే ఆ కోటర్ ను కాజేస్తున్నారు…సాయంత్రం కాగానే తిరిగి బెల్టు దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు..ఇక్కడ బెల్టు దుకాణాల్లో ఒక్కొక్క క్వార్టర్ పై బ్రాండెడ్ ను బట్టి 30 నుండి 50 రూపాయలు అదనంగా ముక్కు పిండి వసూల్ చేస్తున్నారు..ఎం
ఈ దోపిడీ అంత సిండికేట్ మాఫియా..ఆబ్కారీ శాఖ అధికారుల కనుసైగల్లోనే జరుగుతుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు….
ప్రభుత్వం నడ వాలంటే ప్రభుత్వం కు ప్రధాన ఆదాయం మద్యం …కాబట్టే ఆబ్కారీ శాఖ అధికారులు బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయించిన..మద్యం సిండికేట్ యం.ఆర్.పి కి అదనంగా విక్రయాలు జరిపిన ఆంధ్రకు భారీగా మద్యం తరలిస్తున్న పట్టించుకోరు..
ఆబ్కారీ అధికారుల కు కావాల్సింది అమ్మకాలు…నిర్ణయించిన కోటా (మద్యం అమ్మకాలు) చేయాల్సిందే…మద్యం కొనుగోళ్ల కోసం డి.డి లు తీయండి అని వైన్స్ వ్యాపారుల పై ఒత్తిడి తేవాల్సిందే.
రిటైల్ షాప్ కోసం లైసెన్స్…సిండికేట్ మాయ జాలం తో హోల్ సేల్ విక్రయాలు జరుపుతున్న ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు..
నౌకరి నామాలు పేరు ఒకరి పై అమ్మకాలు జరిపేది ఇంకొకరు
ఆబ్కారీ మద్యాన్ని అమ్మమంటుంది
పోలీస్ ఊద మంటుంది
కోర్టు ఫైన్ కట్ట మంటుంది