మద్యం సేవించి పాఠశాలలో హల్చల్…ఉపాధ్యాయున్ని గెంటేసిన సర్పంచ్
విధాత: విద్యార్థులను సన్మా ర్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారితప్పాడు. రోజూ పాఠశాలకు మద్యం సేవించి వస్తూ హల్చల్ చేస్తున్నా డు. ఈ ఘటన వరంగల్ జిల్లా వెంకటా పురం మండలం చిరుతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..చిరుతపల్లి గ్రామంలోని జీపీఎస్ పాఠ శాలలో సున్నం కామరాజు వ్యక్తి ఉపా ధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూ పాఠశాలకు మద్యం సేవించి వస్తూ హల్ చల్ చేస్తున్నాడు. దీంతో విషయం తెలు సుకున్న గ్రామ సర్పంచ్ సదరు ఉపా ధ్యాయున్ని పాఠశాల […]

విధాత: విద్యార్థులను సన్మా ర్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారితప్పాడు. రోజూ పాఠశాలకు మద్యం సేవించి వస్తూ హల్చల్ చేస్తున్నా డు. ఈ ఘటన వరంగల్ జిల్లా వెంకటా పురం మండలం చిరుతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చిరుతపల్లి గ్రామంలోని జీపీఎస్ పాఠ శాలలో సున్నం కామరాజు వ్యక్తి ఉపా ధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూ పాఠశాలకు మద్యం సేవించి వస్తూ హల్ చల్ చేస్తున్నాడు. దీంతో విషయం తెలు సుకున్న గ్రామ సర్పంచ్ సదరు ఉపా ధ్యాయున్ని పాఠశాల నుంచి బయటకు గెంటేశాడు. అనంతరం ఒక్కరోజు ఉపా ధ్యాయుడిగా మారి విద్యార్థలకు సర్పం చ్ పాఠాలు బోధించాడు. అనంతరం సర్పంచ్ కొర్శ నరసింహమూర్తి మాట్లా డుతూ.. కొన్నిరోజులుగా ఉపాధ్యా యుడు కామరాజు ప్రవర్తణలో మార్పు కనిపిస్తోందని, విధి నిర్వాహణలో నిర్ల క్ష్యం చేస్తున్నాడని అన్నారు. పలుమార్లు హెచ్చరించినా ప్రవర్తణలో మార్పు రాలేదని, అందుకే స్కూళ్లోంచి గెంటేశామని తెలిపారు. ఏజెన్సీలో విధులు నిర్వహిస్తూ.. గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించాల్సిందిపోయి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.