Telangana | తెలంగాణలో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ పెట్టుబడులు.. సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో చర్చలు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల సాధన లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం మరో పురోగతి సాధించింది. డల్లాస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు

Telangana | తెలంగాణలో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ పెట్టుబడులు.. సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో చర్చలు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల సాధన లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం మరో పురోగతి సాధించింది. డల్లాస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ప్రపంచ గుర్తింపు సాధించిన చార్లెస్ స్క్వాబ్‌ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

భారత్ లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం. ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతులకు తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్ కు పంపించనున్నట్లు చార్లెస్ స్క్వాబ్ కంపనీ తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.