క‌రోనా బారిన మావోయిస్టులు

విధాత‌(హైద‌రాబాద్‌): క‌రోనా మ‌హ‌మ్మారి అడ‌వుల్లో ఉన్న అన్న‌ల‌ను సైతం వ‌ద‌లడం లేదు. క‌రోనాతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతోంది. మెరుగైన వైద్యం కోసం వారు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల రాక కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీని వీడి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్థికంగా కూడా అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మావోయిస్టులకు కరోనా ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ […]

క‌రోనా బారిన మావోయిస్టులు

విధాత‌(హైద‌రాబాద్‌): క‌రోనా మ‌హ‌మ్మారి అడ‌వుల్లో ఉన్న అన్న‌ల‌ను సైతం వ‌ద‌లడం లేదు. క‌రోనాతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతోంది. మెరుగైన వైద్యం కోసం వారు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టుల రాక కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీని వీడి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్థికంగా కూడా అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మావోయిస్టులకు కరోనా ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజన్ పరిధిలో దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలో సుమారు 70 నుంచి100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి. కరోనా పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

వీరిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత(25లక్షల రూపాయల రివార్డ్),తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌ ఉన్నట్లు సమాచారం. కోవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరఫున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఏస్పీ అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారు.