తగ్గిన ప్రజాదరణ,అసంతృప్తిలో రాష్ట్ర ప్రజలు…కేసీఆర్ స్థానం గల్లంతు.

ఇండియా టుడే సర్వేతో కేసీఆర్ స్థానం గల్లంతు. రాష్ట్రంలో కేసీఆర్​ గ్రాఫ్​ అట్టడుగుకు పడిపోయింది. ఏడాది క్రితం వరకు దేశవ్యాప్తంగా 9వ స్థానంలో నిలిచిన సీఎం జాడ ఇప్పుడు కానరావడం లేదు. దేశ వ్యాప్తంగా నంబర్​వన్ ముఖ్యమంత్రి ఎవరు, ఎవరి పనితీరు బాగుంది, ప్రజలు ఎక్కడ సంతృప్తిగా ఉన్నారనే అంశాలపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. రాష్ట్రాల వారీగా సీఎంల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది.ఇందులో సీఎం […]

తగ్గిన ప్రజాదరణ,అసంతృప్తిలో రాష్ట్ర ప్రజలు…కేసీఆర్ స్థానం గల్లంతు.

ఇండియా టుడే సర్వేతో కేసీఆర్ స్థానం గల్లంతు.

రాష్ట్రంలో కేసీఆర్​ గ్రాఫ్​ అట్టడుగుకు పడిపోయింది. ఏడాది క్రితం వరకు దేశవ్యాప్తంగా 9వ స్థానంలో నిలిచిన సీఎం జాడ ఇప్పుడు కానరావడం లేదు. దేశ వ్యాప్తంగా నంబర్​వన్ ముఖ్యమంత్రి ఎవరు, ఎవరి పనితీరు బాగుంది, ప్రజలు ఎక్కడ సంతృప్తిగా ఉన్నారనే అంశాలపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. రాష్ట్రాల వారీగా సీఎంల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది.ఇందులో సీఎం కేసీఆర్​ వెనకబడిపోయారు. కేవలం మూడు శాతం ఓట్లతో ఏపీ సీఎం జగన్​ కన్నా వెనక్కి వెళ్లారు.

దేశమంతా సర్వే

ఇండియా టుడే ఆధ్వర్యంలో జూలై 10 నుంచి జూలై 20 వరకు దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 11.5 పార్లమెంట్​ నియోజకవర్గాలు, 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఏపీ, అసోం, బిహార్​, చత్తీస్​ఘఢ్​​, ఢిల్లీ, గుజరాత్​, హర్యానా, జార్ఖండ్​, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్​, రాజస్థాన్​, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్​, పశ్చిమ బెంగాల్​ రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 14,559 మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటర్వ్యూ చేశారు. 71% గ్రామీణ ప్రాంతాలు, 29% పట్టణ ప్రాంతాల్లో సర్వే చేసినట్టు సంస్థ వెల్లడించింది. గతంలో ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ముందున్న కేసీఆర్​ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ముందుగా టాప్​ టెన్​ జాబితాను వెలువరించారు. ఈ జాబితాలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందరి కన్నా ముందున్నారు.

స్టాలిన్ పాలన అద్భుతమని 42% మంది తమిళనాడు ప్రజలు అభిప్రాయపడ్డారు. అటు 38%తో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో నిలువగా.. 35%తో కేరళ సీఎం పినరయి విజయన్ మూడో ప్లేస్​ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నాల్గో స్థానంలో(30 %), అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (29%) ఐదో స్థానంలో నిలిచారు. యూపీ సీఎం యోగి ఆరో స్థానంలో (29%), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(22%) ఏడో స్థానంలో, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ఎనిమిదవ స్థానంలో(22%) ఉండగా.. 19%తో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 19%తో 9వ స్థానంలో ఉన్నారు. 19%తో చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ భగేల్ 10వ స్థానంలో నిలిచారు.