విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా ఎక్కడా ఉందో కెసిఆర్ చూపిస్తే ఈ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యనని… ఒక వేళ 24 గంటల కరెంట్ లేకుంటే కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ నామినేషన్ వేయకుండా ఉండాలని, ఈ సవాల్ స్వీకరించే దమ్ము ఈ సన్నాసులకు లేదని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.మంగళవారం అలంపూర్ నియోజకవర్గం లోని శాంతినగర్ లో ఏర్పాటు చేసిన ప్రజా గర్జన సభలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ మూడు గంటల ఇస్తామని కెసిఆర్ పదే పదే అంటున్నారని, కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునే సీఎం ను నడిగడ్డ ప్రజలు తమ పౌరుషం తో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గతం లో RDS పై తుమ్మిళ్ల జలాశయం నిర్మిస్తే అలంపూర్ ప్రాంతం సస్యశామలం అవుతుందని అప్పటి ఇక్కడి ఎమ్మెల్యే సంపత్ కుమార్, తాను అసెంబ్లీ లో గళం ఎత్తమన్నారు. కెసిఆర్ సీఎం అయ్యాక తుమిళ్ల జాలాశాయాన్ని కుర్చీ వేసుకుని కూర్చుని నిర్మాణం చేస్తానని ఈ ప్రాంతం రైతులకు హామీ ఇచ్చిన కెసిఆర్ అనే సన్నాసి పదేళ్లలో ఒక్క రాయి కూడా వేయలేదన్నారు.
సీఎం కు మద్యం తాగి ఫార్మ్ హౌస్ లో పడుకోడానికే సమయం సరిపోదాని, ఇక ప్రజల కోసం ఆలోచించే ద్యాస లేదన్నారు. తుమ్మిళ్ల నిర్మాణం కోసం ఫార్మ్ హౌస్ లో పడుకున్న కెసిఆర్ ను లాక్కొద్దామని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలునిచ్చారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి ఉంటే రాజకీయాల్లో ఉంటాడు.. లేకుంటే ఇంట్లో ఉంటాడు.. కానీ ప్రస్తుతం కెసిఆర్ జీతగాడిగా ఉన్నాడని, కెసిఆర్ కాళ్ల వద్ద ఉండే వ్యక్తి ని మద్దతు ఇచ్చే వ్యక్తి కావాలా, లేకుంటే ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వ్యక్తి కావాలా అని మీరే నిర్ణయం తీసుకొండని రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే బోయ లకు ఎమ్మెల్సీ ఇస్తామని, అలాగే ఎస్టీ జాబితాలో కలుపుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
గట్టు బీముడి కుటుంబం లో అర్హత ఉన్న నేత ఉంటే గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి గా అవకాశం ఇస్తామని అప్పట్లో ఇక్కడి నాయకులకు చెప్పాన్నారు.వారు ఎవరు ముందుకు రాకపోవడo తో బీ ఆర్ ఎస్ నుంచి వచ్చిన గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితకు టికెట్ ఇచ్చామన్నారు. నడిగడ్డ ప్రాంతాన్ని కాపాడుకోడానికి అనాటి సోమానాద్రి పౌరుషం తో ఈ గడ్డలో కరువు, కాటకాల నుంచి కాపాడడని, అలాంటి పౌరుషం తో నడిగడ్డ ప్రజలు ఈ రాష్ట్రo నుంచి తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ , కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.