తెలంగాణ , ఏపీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓటుకు నోటు కేసులో నేరస్తులేనని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు
సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఘాటు వ్యాఖ్యలు..
విధాత, హైదరాబాద్: తెలంగాణ , ఏపీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓటుకు నోటు కేసులో నేరస్తులేనని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటకు నోటు కేసులో చంద్రబాబు ఏ1 అయితే రేవంత్రెడ్డి ఏ2 అని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో రైఫిల్ పట్టుకుని తిరిగిన రేవంత్ ఇప్పుడు సీఎం అయ్యారని, అప్పటి రైఫిల్ రెడ్డే, ఇప్పటి మహఫిల్ రెడ్డి అయ్యిండని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడని సర్టిఫికెట్ ఇస్తున్నాడని, ఆయన మహా మేథావి అంటూ కీర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇంగ్లీషే కాదు హిందీ , తెలుగు కూడా సరిగ్గా రాదని విమర్శించారు. బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాడని, అలాంటి బాబు తెలంగాణ వారికి తెలుగు రాదని, వ్యవసాయం రాదని అంటున్నాడన్నారు. తెలంగాణ ప్రజలకు బాబు తెలుగు, వ్యవసాయం నేర్పిస్తాడట అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు పాశం యాదగిరి.