ఏడేళ్ల చిన్నారిపై లైగిక దాడి

విధాత‌: కాలనీలో ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిని మాయమాటలతో నమ్మించి ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన ముషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారి ఆదివారం సాయంత్రం ఆడుకుంటుండగా అదే ప్రాంతంలో మద్యంతాగి ఉన్న‌ ఓ వ్యక్తి చాక్లెట్‌ కొనిస్తానని పిలిచాడు. కిరణాషాపునకు వెళ్దామంటూ వెంటబెట్టుకుని రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోపక్కకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి ఒక్కసారిగా ఏడవడంతో […]

ఏడేళ్ల చిన్నారిపై లైగిక దాడి

విధాత‌: కాలనీలో ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిని మాయమాటలతో నమ్మించి ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన ముషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారి ఆదివారం సాయంత్రం ఆడుకుంటుండగా అదే ప్రాంతంలో మద్యంతాగి ఉన్న‌ ఓ వ్యక్తి చాక్లెట్‌ కొనిస్తానని పిలిచాడు. కిరణాషాపునకు వెళ్దామంటూ వెంటబెట్టుకుని రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోపక్కకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి ఒక్కసారిగా ఏడవడంతో ఓ మహిళ బయటకు వచ్చి ఈ దారుణఘటన చూసి వెంటనే స్థానికులకు చెప్ప‌డంతో. కాలనీవాసులు ఆ కామాంధుడిని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. ముషీరాబాద్ సీఐ వెంకన్న, ఎస్‌ఐ సురేందర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. దారుణానికి పాల్పడిన వ్యక్తి ఫుట్‌పాత్‌లపై ఉంటూ చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మురళి, అలియాస్‌ మల్లికార్జున్‌(37)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మల్లికార్జున్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి మద్యం తాగాడని, దగ్గరలో ఉన్న మద్యం షాపులను మూసివేయాలనీ స్థానికులు ఆందోళనకు దిగారు.