BRS వైపు యువత చూపు: మంత్రి జగదీష్రెడ్డి
సూర్యాపేటలో బీఆర్ఎస్లో చేరిన యువకులు కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి విధాత: బీజేపీ, కాంగ్రెస్ లపై విసుగు చెందిన యువత టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుడకుడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డ్ 1,2,14 ల నుండి బిజెపి, కాంగ్రెస్ లకు గుడ్ బై చెప్పిన 300 మంది యువకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి […]

- సూర్యాపేటలో బీఆర్ఎస్లో చేరిన యువకులు
- కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి
విధాత: బీజేపీ, కాంగ్రెస్ లపై విసుగు చెందిన యువత టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని
కుడకుడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డ్ 1,2,14 ల నుండి బిజెపి, కాంగ్రెస్ లకు గుడ్ బై చెప్పిన 300 మంది యువకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అధికారం లోకి వచ్చాక రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఉన్న ఉద్యోగాలను ఊడతీస్తుండడంతో యువత కేంద్రం తీరుపై విసుగు చెందుతున్నారన్నారు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన మోడీ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వేతో పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసుకుందని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. మతంపేరుతో రాజకీయం చేస్తూ దేశంలో చిచ్చుపెడుతున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల భారత్ తిరోగమనంలో పయనిస్తున్నదన్నారు. దేశానికి ప్రధాన ఆధారమైనా వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేశారన్నారు.
బిజెపి ప్రభుత్వ హయాంలో పేదలు మరింత పేదరికంలోకి వెళ్తుండగా, సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటున్నారని అన్నారు. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అనేక సామాజిక జాఢ్యాలతో దేశం నేడు సంక్షుభితంగా మారిపోయిందన్నారు.
ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు ఆ రెండు పార్టీలను ఎన్నుకొంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి నూతన పార్టీ బిఆర్ఎస్, సమర్థ నాయకత్వం కేసీఆర్ రూపంలో దొరింకిందన్నారు..
దేశ ప్రజల కలలను సాకారం చేసే నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, దేశంలో రైతుల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలనతో యువత, మేధావులు, సామాన్య ప్రజానీకం విసుగెత్తిపోయారని, దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అన్నిరాష్ట్రాల వారు కేసీఆర్ పార్టీ గురించి చర్చిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో దేశం గొప్ప మలుపు తిరగబోతున్నదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
మంత్రి సమక్షంలో దేషోజు రవి అధ్వర్యంలో, మహంకాళిశివ, ప్రసన్న, శ్రవణ్, వంశీ, కార్తిక్, సాయి, ప్రసాద్, అశోక్, పవన్, సందీప్, సాయి, చింటు, వెంకట్, రమేష్, మనిదీప్, వారి అనుచరులు బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గుర్రం సత్యనారయణ రెడ్డి, జడ్పీటిసి సంజీవ నాయక్, చివ్వెంల వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి , పెన్ పహాడ్ ఎంపిపి నేమ్మాధి బిక్షం తదితరులు పాల్గొన్నారు.