విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం మరో అడుగు వేసింది. పోడు రైతుల దరఖాస్తుల పరిశీలన, ఎంపిక తదితర అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోఆర్డినేషన్ కమిటీలో జిల్లా ఇంఛార్జి మినిస్టర్ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు. పోలీస్ కమిషనర్ /ఎస్పీ, ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), అడిషనల్ కలెక్టర్ (స్థానిక […]
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం మరో అడుగు వేసింది. పోడు రైతుల దరఖాస్తుల పరిశీలన, ఎంపిక తదితర అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోఆర్డినేషన్ కమిటీలో జిల్లా ఇంఛార్జి మినిస్టర్ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు.
పోలీస్ కమిషనర్ /ఎస్పీ, ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, DRDO, DTPO ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపారు.