డెల్టా ప్లస్ డేంజర్..పక్కనుండి పోయినా అంటుకుంటుంది .. !
విధాత:నిన్న , మొన్నటి వరకు కరోనా సెకండ్ కారణంగా అతలాకుతలం అయిన జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది . కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు అలాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి . వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కరోనా నుంచి పూర్తిగా బయటపడొచ్చునని బావిస్తుండగా .. డెల్టా ప్లస్ ఆందోళన కలిగిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది డెల్టా ప్లస్ గా మారినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి […]

విధాత:నిన్న , మొన్నటి వరకు కరోనా సెకండ్ కారణంగా అతలాకుతలం అయిన జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది . కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు అలాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి . వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కరోనా నుంచి పూర్తిగా బయటపడొచ్చునని బావిస్తుండగా .. డెల్టా ప్లస్ ఆందోళన కలిగిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది డెల్టా ప్లస్ గా మారినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే . ప్రస్తుతం దేశంలో 40 కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదు అయ్యాయి . మహారాష్ట్ర , కేరళ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు కాగా .. కర్ణాటక , తమిళనాడు , జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లోనూ కేసులు మొదలయ్యాయి .
ఈ డెల్టా ప్లస్ ను గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్ లోని ఓ మహిళా చనిపోయింది . సదరు మహిళ ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు . ఇక ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే .
ఇదిలా ఉంటే .. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మరింత శక్తివంతమని , వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు , శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు . డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్ సోకే అవకాశం ఉందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా ఇటీవల తెలిపారు . ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకుందని హెచ్చరించారు . మాస్కులు , శానిటైజేషన్ , భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు .
ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని , రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు . రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమన్నారు . మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ , కోవార్టిన్ టీకాలు డెల్టా రూపాంతరితం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి . కానీ డెల్టా ప్లస్ విషయంలో టీకాల సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు . టీకా ఒక డోసు తీసుకున్న తర్వాత కొందరు వైరస్ బారిన పడటాన్ని బట్టి చూస్తే కొత్త రూపాంతరితాలపై టీకా ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు .