Mancherial | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం నెలకొంది. పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో యువకుడు అంజన్న( 27) మృతి చెందాడు. అంజన్నపై లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో ఆదివారం సాయంత్రం పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. కాగా.. రాత్రి స్టేషన్ లోనే కూర్చున్న యువకుడు ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. గమనించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా సీసీ టీవీ ఫుటేజీలో యువకుడు […]
Mancherial |
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం నెలకొంది. పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో యువకుడు అంజన్న( 27) మృతి చెందాడు. అంజన్నపై లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో ఆదివారం సాయంత్రం పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.
కాగా.. రాత్రి స్టేషన్ లోనే కూర్చున్న యువకుడు ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. గమనించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా సీసీ టీవీ ఫుటేజీలో యువకుడు మృతి చెందిన దృశ్యాలు రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు.
బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి
మంచిర్యాల – బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు.
ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి… pic.twitter.com/xV9RCXBZ3c
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2023