చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమావేశం

విధాత‌:రాష్ట్రంలో 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా జ‌రుగుతుంది.రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఎక్కడా తట్ట మట్టి పోయలేదు.రోడ్డు సెస్ రూ.1200 కోట్లు దారి మళ్లించారు,దారిమళ్లించిన నిధులను తిరిగి ఇచ్చి వెంటనే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలి.జగన్&కో అవినీతి, దుబారాలే నేటి ఆర్థిక సంక్షోభానికి కారణాలని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన జ‌రిగిన‌ టీడీపీ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై 7వ తేదీ నిరసన కార్యక్రమాలు చేప‌డ‌తామ‌న్నారు.రెండేళ్లయినా ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల […]

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమావేశం

విధాత‌:రాష్ట్రంలో 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా జ‌రుగుతుంది.రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఎక్కడా తట్ట మట్టి పోయలేదు.రోడ్డు సెస్ రూ.1200 కోట్లు దారి మళ్లించారు,దారిమళ్లించిన నిధులను తిరిగి ఇచ్చి వెంటనే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలి.జగన్&కో అవినీతి, దుబారాలే నేటి ఆర్థిక సంక్షోభానికి కారణాలని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు అధ్యక్షతన జ‌రిగిన‌ టీడీపీ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై 7వ తేదీ నిరసన కార్యక్రమాలు చేప‌డ‌తామ‌న్నారు.రెండేళ్లయినా ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయకపోవడం కోర్టు ధిక్కరణ చర్య. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని,సమస్యను పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నారన్నారు.

జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. హోంమంత్రినీ డమ్మీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు.ఆయా వర్గాలకు జగన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయించాం,ఏపీఎస్ డీసీ ద్వారా అప్పులు తీసుకువచ్చి ఉద్దేశపూర్వకంగా మోసం చేశారు. ఇది మౌలిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కేంద్రం లేఖ రాయడం జగన్ రెడ్డి తీరుకు నిదర్శనం.మున్సిపల్ ఉద్యోగులు జీతాలు అడిగితే అరెస్ట్ చేసే దుస్థితిని జగన్ ప్రభుత్వం సృష్టించింది. ఉద్యోగులకు అండగా ఉండాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.వివేకానందరెడ్డి కేసును నీరుగార్చే కుట్ర జ‌రుగుతుంద‌ని డా.సునీతారెడ్డి ఇచ్చిన జాబితాలోని ఇంటి వారిని ఇంకా ఎందుకు విచారించలేదు? జగన్ రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత పెరిగింది. ఎక్కడా అభివృద్ధి లేదన్నారు.