అందాల ముద్దుగుమ్మ అనుష్క గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అరుంధతి సినిమాతో తనలోని నట విశ్వరూపం చూపించి ఆడియన్స్ మంత్ర ముగ్ధులు అయ్యేలా చేసింది. అనుష్క ఆ తర్వాత చేసిన లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. బాహుబలి సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే బాహుబలి వరకు అడపాదడపా ప్రేక్షకులని పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం అరఒకటి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ని డిజప్పాయింట్ చేస్తుంది. అనుష్క చివరిగా `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`సినిమా చేయగా, ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అమ్మడు కొత్తగా మరే సినిమాని ఒప్పుకోలేదు.
మాములుగా అనుష్క పాత్ర కోసం ప్రాణం పెట్టి పని చేస్తుంది. ఈ క్రమంలో సైజ్ జీరో చిత్రం కోసం భారీ బరువు పెరిగింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించిన ఈ చిత్రం బరువు పెరగడం, తగ్గడమనే కాన్సెప్ట్ తో పాటు క్యాలరీలు కరిగిస్తూ ఎనర్జీని, పవర్ని జనరేట్ చేయాలనే కాన్సెప్ట్ తో రూపొందింది. ఇందుకోసం అనుష్క బాగా కష్టపడి బరువు పెరిగింది. అనుష్క పడ్డ కష్టం అంతా బూడితలో పోసిన పన్నీరు అయింది. సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క సైజ్ తగ్గేందుకు చాలా ప్రయత్నించిన అది సాధ్యపడడం లేదు. దాంతో అనుష్క బయటకు రావడం కూడా మానేసింది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమాకి ముందు నుంచే అనుష్క బయట కనిపించడం చాలా తగ్గించింది. ప్రైవేట్ లైఫ్కి పరిమితం అయిన ఈ భామ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్లోను పెద్దగా కనిపించలేదు. స్వీటీ భారీగా బరువు పెరగడం, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె సినిమాలు కూడా తగ్గించింది. అయితే చాలా రోజుల తర్వాత అందాల అనుష్క ఓ హోటల్లో మెరిసింది. అయితే తనని ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ ధరించింది. ఇక లావుగా కనిపించకుండా లూస్ దుస్తులు ధరించింది. అయితే అప్పటికే అనుష్కని కొందరు గుర్తు పట్టి కెమెరాలలో బంధిస్తుండగా, ఆమె ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్లిపోయింది. ఇది చూసిన కొందరు పాపం.. అనుష్కకి ఎలాంటి పరిస్థితి తలెత్తిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.