Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. గురువారం బులియన్ మార్కెట్లో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ తులం రూ.60,550 ధర పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడి తులం రూ.66,110 వద్ద నిలకడగా ఉన్నది. మరో వైపు వెండి ధర సైతం స్థిరంగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,710 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.60,590 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,100 వద్ద స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,250 వద్ద నిలకడగా ఉన్నది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.60,590 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,590 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం నిలకడగానే ఉన్నది. హైదరాబాద్లో వెండి కిలోకు రూ.80,300 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.