Gold Rates | బంగారం ధరలు దిగివస్తున్నాయి. వరుసగా రెండోరోజూ ధరలు పతనమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ధరల పెరుగులదలతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం బులియన్ మార్కెట్లో పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్పై స్వల్పంగా రూ.10 తగ్గి తులానికి రూ.60,340కి చేరింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 తగ్గి.. తులం రూ.65,830కి దిగివచ్చింది. మరో వైపు వెండి సైతం స్వల్పంగా పతనమైంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,090 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,640కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.60,340 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.65,830కి తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.60,490 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65,980కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.60,340 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.65,830 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర స్వల్పంగా దిగివచ్చింది. రూ.100 తగ్గడంతో కిలో ధర రూ.75,100కు దిగజారింది. హైదరాబాద్లో వెండి కిలోకు రూ.78,400 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.