Gold Rates | స్వల్పంగా దిగివచ్చిన బంగారం..! అయినా తులానికి రూ.66వేలకుపైనే..!

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్పంగా ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో శనివారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.10 తగ్గి తులానికి రూ.61,340కి చేరింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 తగ్గి తులం రూ.66,920కి తగ్గింది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,990 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,630కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.61,340 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,920కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.61,940 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,070కి పతనమైంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.61,340 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,920 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. రూ.100 పెరిగి కిలో ధర రూ.76,400కి తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి రూ.79,400కు పడిపోయింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.