Elephant Attacks| జగన్నాథ రథయాత్రలో అపశృతి..భక్తులపై దూసుకెళ్లిన ఏనుగు

విధాత : గుజరాత్లోని గోల్వాడ వద్ద జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రథయాత్రలో భాగంగా తీసుకొచ్చిన ఓ ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప తొక్కిసలాట నెలకొంది. ఏనుగు బారి నుండి తప్పించుకునేందుకు భయంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాటలో తొమ్మిది మందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
అయితే రోడ్డు మీదుగా పరుగులు తీస్తున్న ఆ గజరాజును మావటిలు వెంటబడి మరి అదుపు చేయడంతో పెను ప్రమాద తప్పింది. అదే సమయంలో ఊరెగింపులో ఉన్న మిగతా ఏనుగులు ప్రశాంతంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
గుజరాత్ – జగన్నాథ రథయాత్రలో అపశృతి
ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు
భయంతో పరుగులు తీసిన భక్తులు, తొక్కిసలాట
పలువురు భక్తులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/OO2ZeOu5M3
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2025