Gold Rate | ప్చ్‌ బంగారం మళ్లీ పెరిగింది..! హైదరాబాద్‌లో రూ.72వేలు పసిడి..!

Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇస్తూనే ఉన్నాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర మంగళవారం మరోసారి పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 పెరిగి.. తులానికి రూ.66,350కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ.330 పెరిగి.. తులానికి 72,380కి ఎగిసింది.

Gold Rate | ప్చ్‌ బంగారం మళ్లీ పెరిగింది..! హైదరాబాద్‌లో రూ.72వేలు పసిడి..!

Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇస్తూనే ఉన్నాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర మంగళవారం మరోసారి పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 పెరిగి.. తులానికి రూ.66,350కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ.330 పెరిగి.. తులానికి 72,380కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,430కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,380కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,530 జంప్‌ చేసింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,380 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగానే పెరిగింది. రూ.100 పెరిగి ఢిల్లీలో కిలో రూ.85వేలకు ఎగిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.88,500 ధర పలుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.