స్వల్ప ఊరటనిచ్చిన బంగారం ధరలు..! హైదరాబాద్‌లో ఎంత తగ్గిందంటే..?

స్వల్ప ఊరటనిచ్చిన బంగారం ధరలు..! హైదరాబాద్‌లో ఎంత తగ్గిందంటే..?

కొనుగోలుదారులకు బంగారం ధరలు స్వల్పంగా ఊరటనిచ్చాయి. మొన్నటి వరకు భారీగా ధరలు పెరుగుతూ వచ్చాయి. నిన్న నిలకడగా కొనసాగగా.. మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 తగ్గి తులం రూ.56,350కి చేరింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.170 పతనమై.. తులానికి రూ.61,470కి తగ్గింది.


దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,620కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,470కి పడిపోయింది.


ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.57వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,180కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,470కి తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,470 పలుకుతున్నది.


ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది. రూ.200 పెరిగి కిలో రూ.75,200కు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,200 పలుకుతోంది.