CM Revanth Reddy | డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | డ్రగ్స్ రహిత తెలంగాణ మా ప్రజాప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఉద్యమాలకు అడ్డగా నిలిచిన తెలంగాణ…డ్రగ్స్ కు అడ్డగా మారుతుంటే చూస్తు ఊరుకోబోమన్నారు. గంజాయి డ్రగ్స్ విక్రయిస్తే వెన్ను విరుస్తామని ఇప్పటికే స్పష్టం చేశామని..ఇందుకోసం ఈగల్ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇకపై నార్కొటిక్ బ్యూరోను.. ఈగల్గా పిలుస్తాం.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందని తెలిపారు. స్కూళ్లు, కళాశాలల వద్ధ డ్రగ్స్ దొరికితే యజమాన్యాలపై కూడా కేసులు పెట్టాలని ఆదేశిస్తున్నామన్నారు. డ్రగ్స్ వంటి అసాంఘిక అంశాలపై విద్యాసంస్థలు అవేర్ నెస్ సమావేశాలు పెట్టాలన్నారు.
తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ఉద్యమ స్ఫూర్తితో అందరు ముందుకు రావాలన్నారు.148 కోట్ల జనాభాలో 68శాతం 40ఏళ్ల లోపువారే ఉన్నారని..అయినా కూడా ఒలంపిక్స్ లో ఒక్క స్వర్ణ పతాకం కోసం ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు, వన్ ట్రిలియన్ సాధనకు తెలంగాణ రైజింగ్ తో ముందుకెలుతున్నామన్నారు. తెలంగాణ యువతను డ్రగ్స్ కు దూరంగా కేరీర్ వైపు మళ్లించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రైజింగ్ తో ప్రపంచ దేశాలతో పోటీ పడబోతున్నామన్నారు, విద్యార్థుల, యువతలో క్రీడానైపుణ్యం పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. తెలంగాణను దేశానికి స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్నదే మా ఆశయమన్నారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలు రాంచరణ్, ఆయన తండ్రి చిరంజీవి, నాలాగే నల్లమల నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ వంటి వారిని స్పూర్తిగా తీసుకుని యువత తమతమ రంగాల్లో క్రమశిక్షణతో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామన్నారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో బహిష్కరిస్తున్నారని..త్వరలో టాలీవుడ్లో కూడా ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.