మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర..! తులం ఎంత ఉందంటే..?
పుత్తడి ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లో ధర శనివారం మళ్లీ పెరిగింది

Gold Rates | పుత్తడి ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లో ధర శనివారం మళ్లీ పెరిగింది. 22 క్యారెట్లపై బంగారంపై రూ.300 పెరిగి తులానికి రూ.57,700 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.330 పెరిగి తులానికి రూ.62,950కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,380కి చేరింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,950కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,100కి చేరింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,950 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. రూ.200 పెరగడంతో కిలో బంగారం ధర రూ.75,700కి చేరింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.77,200లకు చేరిది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.