విధాత: యాదగిరిగుట్ట (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొలువుదీరిన శ్రీ ఆండాళ్ అమ్మవారి ఊంజల సేవోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. గర్భాలయంలో వేకువ జామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యభిషేకము, నిత్యారాధనలు నిర్వహించారు. ఆగమశాస్త్రానుసారం ప్రాకారమండపంలో హోమం, తిరు కల్యాణం వైభవంగా కొనసాగాయి. కొండపైన శివాలయంలో పర్వత వర్ధిని రామలింగేశ్వరుడి నిత్య పూజలు సాంప్రదాయానుసారం నిర్వహించారు. సాయంత్రం యాదాద్రి ప్రధానాలయంలో, పాత గుట్ట ఆలయంలో కొలువైన ఆండాళ్ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. […]
విధాత: యాదగిరిగుట్ట (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొలువుదీరిన శ్రీ ఆండాళ్ అమ్మవారి ఊంజల సేవోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. గర్భాలయంలో వేకువ జామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యభిషేకము, నిత్యారాధనలు నిర్వహించారు. ఆగమశాస్త్రానుసారం ప్రాకారమండపంలో హోమం, తిరు కల్యాణం వైభవంగా కొనసాగాయి.
కొండపైన శివాలయంలో పర్వత వర్ధిని రామలింగేశ్వరుడి నిత్య పూజలు సాంప్రదాయానుసారం నిర్వహించారు. సాయంత్రం యాదాద్రి ప్రధానాలయంలో, పాత గుట్ట ఆలయంలో కొలువైన ఆండాళ్ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అమ్మవారికి మహిళా భక్తులు, ఆర్చకులు మంగళ నీరాజనాలు పలికారు. యాదాద్రిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు శనివారం ఆలయంలో దీపోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి నిత్యాదాయము శుక్రవారం 34 లక్షల 12,537 రూపాయలుగా వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.