విధాత, భద్రాచలం: దేవాలయాల్లో పవిత్రంగా ఇచ్చే లడ్డూ ప్రసాదాల్లో కూడా పాలక మండలి కక్కుర్తికి పాల్పడుతున్నది. ఇవాళ భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో బూజూ పట్టిన వేలాది లడ్డూలు విక్రయించారు. లడ్డూలను తినే సమయంలో లోపలి నుంచి దుర్వాసన తో పాటు బూజూ పట్టినట్లు కన్పించడంతో భక్తులు కంగుతున్నారు. బూజు పట్టిన లడ్డూలను విక్రయిస్తున్నారంటూ ప్రసాదం కౌంటర్ వద్దకు వెళ్లి పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూలను వెనక్కి తీసుకుని డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ […]
విధాత, భద్రాచలం: దేవాలయాల్లో పవిత్రంగా ఇచ్చే లడ్డూ ప్రసాదాల్లో కూడా పాలక మండలి కక్కుర్తికి పాల్పడుతున్నది. ఇవాళ భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో బూజూ పట్టిన వేలాది లడ్డూలు విక్రయించారు. లడ్డూలను తినే సమయంలో లోపలి నుంచి దుర్వాసన తో పాటు బూజూ పట్టినట్లు కన్పించడంతో భక్తులు కంగుతున్నారు.
బూజు పట్టిన లడ్డూలను విక్రయిస్తున్నారంటూ ప్రసాదం కౌంటర్ వద్దకు వెళ్లి పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూలను వెనక్కి తీసుకుని డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో రాములోరిని దర్శించుకుని లడ్డూలు కొనుగోలు చేశారు.
ముక్కోటి ఏకాదశికి మిగిలిన లడ్డూలను ఇవాళ విక్రియించడమేంటని భక్తులు ప్రశ్నించారు. వేలాది బూజు పట్టిన లడ్డూ ప్రసాదాలను విక్రయించారని, పాలక మండలి నిర్లక్ష్యం కారణంగానే ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని భక్తులు మండిపడ్డారు.