దసరా రోజు సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ.. 9న ఢిల్లీలో బ‌హిరంగ స‌భ!

విధాత‌, హైద‌రాబాద్‌: దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం మంత్రులు, ఎంపీలు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలతో చర్చించారు. డిసెంబ‌ర్ 9న ఢిల్లీలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్‌ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నదని తెలిపారు. ఈనెల 5న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్‌లో జాతీయ పార్టీగా […]

దసరా రోజు సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ.. 9న ఢిల్లీలో బ‌హిరంగ స‌భ!

విధాత‌, హైద‌రాబాద్‌: దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం మంత్రులు, ఎంపీలు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలతో చర్చించారు. డిసెంబ‌ర్ 9న ఢిల్లీలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్‌ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నదని తెలిపారు.

ఈనెల 5న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్‌లో జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత చెప్పారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయనున్నారు. కొత్త పార్టీకి కూడా గులాబీ జెండా, కారు గుర్తే ఉంటాయని స్పష్టం చేశారు.

సమావేశం అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. రేగ కాంతారావు మాట్లాడుతూ 5న సీఎం సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారన్నారు. దేశ ప్రజలు, యువత సీఎం కేసీఆర్‌ రాక కోసం చూస్తున్నారని, కొన్ని పార్టీలు విలీనం కావడంతో పాటు మరి కొన్ని పార్టీలు కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఈ విషయాలన్నింటిని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ వివరిస్తారన్నారు.అయితే.. ఇప్పటికే చాలా మంది నాయకులు చిన్న పార్టీలను టీఆర్ఎస్‌లో విలీనం చేస్తామని ముందుకు వస్తున్నారని చెప్పారు. 5వ తేదీన కొంతమంది జాతీయ నేతలు ఈ సమావేశానికి వస్తారని తెలిపారు.

కాగా ఈ నేపథ్యంలోనే.. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ..నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రైతులు, యువతీ యువకులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనన్నీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పారు.