విధాత: తాజ్ మహల్ నమూనాలో గుమ్మటాలతో నిర్మించిన కొత్త సచివాలయం గుమ్మటాలను బీజేపీ అధికారంలోకి రాగానే కూల్చివేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి నియోజకవర్గం బోయినపల్లి చౌరస్తాలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతికి కొత్త సచివాలయ డోములు విరుద్ధంగా ఉన్నాయని, వాటిని కూల్చి తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎంఐఎం రెండు ఒకటేనని, అందుకే తాజ్ మహల్ కంటే […]
విధాత: తాజ్ మహల్ నమూనాలో గుమ్మటాలతో నిర్మించిన కొత్త సచివాలయం గుమ్మటాలను బీజేపీ అధికారంలోకి రాగానే కూల్చివేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి నియోజకవర్గం బోయినపల్లి చౌరస్తాలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతికి కొత్త సచివాలయ డోములు విరుద్ధంగా ఉన్నాయని, వాటిని కూల్చి తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు.
బీఆర్ఎస్ ఎంఐఎం రెండు ఒకటేనని, అందుకే తాజ్ మహల్ కంటే కొత్త సచివాలయం అద్భుతంగా కట్టారని ఓవైసీ చెబుతున్నారన్నారు. అసదుద్దీన్ కళ్లల్లో ఆనందం కోసమే సీఎం కేసీఆర్ తాజ్ మహల్ నమూనాలో గుమ్మటాలతో కొత్త సచివాలయం నిర్మించారన్నారు.
మంత్రి కేటీఆర్ రోడ్ల పక్కన ఉన్న గుడులు, మసీదులను కూల్చి వేస్తామంటున్నారని, కేటీఆర్కు దమ్ముంటే ఈ కూల్చివేతలను ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభించాలని బండి సంజయ్ సవాల్ చేశారు.
కొత్త సచివాలయం డోములు కూల్చేస్తాం: బండి సంజయ్ https://t.co/dBtjokZols pic.twitter.com/EPwDbWtROq
— vidhaathanews (@vidhaathanews) February 10, 2023