పండగపూట కూడా పైసలిచ్చేలా లేరు: విజయశాంతి
విధాత: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి తనదైన శైలిలో మండిపడ్డారు. ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లేవనెత్తారు. కొద్ది రోజుల్లో దసరా, బతుకమ్మ పండుగలు ఉన్నందున ఈ నెల అయినా సమయానికి జీతాలు వేస్తారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపైనే ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోందని విజయశాంతి అన్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ఆలస్యంగా వేతనాలు జమ చేస్తూ ఉంటే.. అక్టోబర్లోనూ అలాగే లేట్ అయితే పండుగలకు పైసలెట్ల? అంటూ ప్రశ్నించారు. విజయశాంతి సోషల్ మీడియా […]

విధాత: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి తనదైన శైలిలో మండిపడ్డారు. ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లేవనెత్తారు. కొద్ది రోజుల్లో దసరా, బతుకమ్మ పండుగలు ఉన్నందున ఈ నెల అయినా సమయానికి జీతాలు వేస్తారా? అని ప్రశ్నించారు.
ఈ విషయంపైనే ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోందని విజయశాంతి అన్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ఆలస్యంగా వేతనాలు జమ చేస్తూ ఉంటే.. అక్టోబర్లోనూ అలాగే లేట్ అయితే పండుగలకు పైసలెట్ల? అంటూ ప్రశ్నించారు. విజయశాంతి సోషల్ మీడియా ద్వారా ఈ విమర్శలు చేశారు.
‘‘తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ పండగపూట కూడా పైసలిచ్చేలా లేదు. అక్టోబర్ 3న బతుకమ్మ, 5న దసరా పండుగలున్నయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల టెన్షన్ పట్టుకుంది. సరైన సమయానికి వేతనాలు వస్తాయా? లేవా? అనే ఆందోళనలో ఉద్యోగులున్నరు. అక్టోబర్ మొదటివారంలోనే బతుకమ్మ, దసరా పండుగలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.
ప్రతి నెలా ప్రభుత్వం ఆలస్యంగా వేతనాలు జమ చేస్తుండటంతో.. అక్టోబర్లోనూ అలాగే లేట్ అయితే… పండుగలకు పైసలెట్ల? అనే ఆందోళన మొదలైంది. కనీసం వచ్చే నెలలో అయినా ఒకటో తేదీకి జీతాలొస్తే పండుగ షాపింగ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు.
కానీ వేతనాలను ప్రభుత్వం ముందుగానే జమ చేస్తుందా? లేదా ఎప్పటిలాగే ఆలస్యంగా అందిస్తుందా? అనేది సస్పెన్స్గా మారింది. ఏం కేసీఆర్… ఉద్యోగులతో ఇంకెన్ని రోజులు ఈ ఆటలు? త్వరలో సర్కారీ ఉద్యోగులే… కేసీఆర్ సర్కార్ను పడగొట్టడం ఖాయం.’’ అని విజయశాంతి ఫేస్ బుక్, ట్విటర్ వేదికగా స్పందించారు.