ప్రజలు జూ. ఎన్టీఆర్ను కోరుతున్నారు.. లోకేశ్ను కాదు: మంత్రి ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు
నారా లోకేష్ను ప్రజలు కోరుకోవడం లేదు చంద్రబాబు రెండు చోట్లా ఫెయిల్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివాదాస్పద వ్యాఖ్యలు విధాత: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ నాయకులు నారా చంద్రబాబునాయుడు, లోకేష్ నాయకత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును కానీ, లోకేశ్ను కానీ పార్టీ సారథ్యం కోసం ఇష్ట పడటం లేదని, ప్రజలు జూ. ఎన్టీఆర్ను ఆ స్థానంలో కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇటు […]

- నారా లోకేష్ను ప్రజలు కోరుకోవడం లేదు
- చంద్రబాబు రెండు చోట్లా ఫెయిల్
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివాదాస్పద వ్యాఖ్యలు
విధాత: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ నాయకులు నారా చంద్రబాబునాయుడు, లోకేష్ నాయకత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును కానీ, లోకేశ్ను కానీ పార్టీ సారథ్యం కోసం ఇష్ట పడటం లేదని, ప్రజలు జూ. ఎన్టీఆర్ను ఆ స్థానంలో కోరుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణలో, అటు ఏపీలో రెండు చోట్ల ఫెయిల్ అయ్యారన్నారు. చంద్ర బాబు నాయుడు బుధవారం ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు గతంలో కంటే భిన్నంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బీజేపీతో మూలాఖత్ అయ్యాడు!
చంద్రబాబు తెలంగాణలో ఫెయిల్ అయి.. ఆంధ్రలో ఫెయిల్ అయి.. ఎక్కడ పొద్దుబోక బీజేపీతో మూలాఖత్ అయ్యి చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని నిజంగా చంద్రబాబుకు టీడీపీపై, ఎన్టీఆరఖపై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ను అధ్యక్షుడిగా చేసి, ముఖ్యమంత్రి చేయాలని అప్పుడే ఆయన చిత్తశుద్ధి తెలుస్తుంది అన్నారు. లేకపోతే తెలంగాణలో చంద్రబాబు షర్మిల, కేఏ పాల్ అయినట్టే అవుతారని ఎద్దేవా చేశారు.
హన్మకొండలో గురువారం రైతు కల్లాలు – కేంద్ర ప్రభుత్వ వైఖరి” పై నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబుపై మాట్లాడారు.
మంత్రి మాటల్లోనే
‘టీడీపీ తెలంగాణలో ఫెయిల్ అయింది. ఆంధ్రాలో ఫెయిల్ అయింది దీంతో ఎక్కడ పొద్దుబోక ఇక్కడికి వచ్చి చిచ్చుపెట్టాలని, కాంగ్రెస్సోలను కలుపుకొని గతంలో ఒక ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్ అయింది. ఇప్పుడు బీజేపీ వాళ్లతో ములాఖత్ అయినట్టు అనిపిస్తుంది.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ. ఆయన మధ్యలో వచ్చారు. ఎన్టీ రామారావు స్ఫూర్తి.. ఎన్టీ రామారావు పేద ప్రజలకు చేసిన సేవ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మర్చిపోలేదు. పేదల స్కీమ్స్ తెచ్చింది ఎన్టీ రామారావు. అది నువ్వు కాదు. ఎన్టీ రామారావు స్ఫూర్తి తీసుకొని, ఎన్టీ రామారావుతో పని తీసుకొని, ఎన్టీ రామారావుతో బతికినవు. ఆ తరవాత ఆ కుటుంబాన్ని మోసం చేసినవు. నీ కొడుకుని ఆంధ్రలో పెట్టి, పాపం హరికృష్ణ బిడ్డను తెలంగాణలో పెట్టావు. అది కక్ష సాధింపు కాదా..?
జూనియర్ ఎన్టీఆర్ను ఏపీలో కోరుకుంటున్నారు. ఆయనను అధ్యక్షునిగా కోరుకుంటున్నారు. లోకేష్ ని కోరుకోవడం లేదు. ఆంధ్రలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నీ కొడుకు కావాలని కోరుకోవట్లేదు.కానీ లోకేష్ ని ఎంకరేజ్ చేస్తున్నావ్.
నీకు తెలుగుదేశంతో పార్టీ మీద విశ్వాసం ఉన్నా.. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి చేయి. అప్పుడు తెలుగుదేశం మీద ఎంత విశ్వాసం ఉంది? ఎన్టీ రామారావు మీద ఎంత కృతజ్ఞత ఉంది తెలుస్తుంది. లేకపోతే షర్మిల, ఏమైందో తెలుసు.. పాల్ ఏమైయ్యాడో తెలుసు..సేమ్ అదే టైపులో చంద్రబాబు అయితడని’ మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.