సరికొత్తగా మరో బైక్‌ను లాంచ్‌ చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌..! అడ్వాన్స్‌ బుకింగ్స్‌ షురూ..!

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సరికొత్త బైక్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ మోడల్‌ బైక్‌ పేరు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450. కొత్త మోడల్‌ బైక్‌లో 450సీసీ, సింగిల్​ సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్‌తో వస్తుంది

సరికొత్తగా మరో బైక్‌ను లాంచ్‌ చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌..! అడ్వాన్స్‌ బుకింగ్స్‌ షురూ..!

విధాత‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సరికొత్త బైక్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ మోడల్‌ బైక్‌ పేరు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450. కొత్త మోడల్‌ బైక్‌లో 450సీసీ, సింగిల్​ సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్‌తో వస్తుంది. 450 హెచ్​పీ పవర్​ని, 40 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేయనున్నది. బైక్‌ బరువు 196కేజీల వరకు ఉంటుంది. ఇందులో 17 లీటర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ ఉండగా.. 825ఎంఎం అడ్జెస్టెబుల్​ సీట్​ హైట్​ ఉంటుంది.


బైక్‌ రౌండ్​ టీఎఫ్​టీ కలర్​ స్క్రీన్​ వస్తుండగా.. గూగుల్​ మ్యాప్స్​ ఇంటిగ్రేటెడ్​గా ఉంటుంది. స్క్రీన్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్‌ చేసుకోవచ్చు. కాల్స్‌, నోటిఫికేషన్స్‌, ఎస్‌ఎంఎస్‌లను సైతం యాక్సెస్‌ చేసుకునే వీలుంది. బైక్‌లో అదనంగా రైడ్‌ బై వైర్‌ టెక్నాలజీ, స్విచ్చేబుల్‌ ఏబీఎస్‌, ఫుల్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తుంది. బైక్‌లో 21/17 ఇంచ్​ స్పోక్​ వీల్స్​ ఉండగా.. సస్పెన్షన్‌ విషయానికి వస్తే ఫ్రంట్‌లో షోవా యూఎస్‌డీ ఫోర్క్స్‌, రియర్‌లో మోనో షాక్‌ అబ్సార్బర్స్​ ఉండగా.. ఫ్రంట్‌, రియర్‌లో డిస్క్‌ బేక్స్‌ ఉన్నాయి.


ధర ఎంత అంటే..?


రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450లో బైక్‌ మోడల్‌లో మూడు వేరియంట్లు ఉండనున్నాయి. అవి బేస్​, పాస్​, సమిట్​. బేస్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.2.69లక్షలు కాగా.. పాస్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.2.74లక్షలు. సమిట్‌ వేరియంట్‌ మోడల్‌ ఎక్స్‌షోరూం ధర రూ.2.84లక్షలు. ఇంట్రొడక్టరీ ధరగా తెలుస్తుండగా.. డిసెంబర్‌ 31 వరకు ఇవే ధరలు కొనసాగనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత బైక్‌ ధరను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఈ హిమాలయన్‌ 450 బైక్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. కంపెనీకి చెందిన డీలర్‌షిప్‌ షోరూముల్లో బైక్‌లను బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ బైక్‌ కేటీఎం 390 అడ్వెంచర్‌, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్​ తదితర బైక్స్‌కు మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వనుందని టాక్‌ నడుస్తున్నది. ఇదిలా ఉండగా.. కంపెనీకి చెందిన హిమాలయన్‌ 411 మోడల్‌ను డిస్‌ కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించింది. 2016లో లాంచ్‌ అయిన ఈ మోడల్‌ బైక్‌కు అడ్వెంచర్‌ టూరింగ్‌ బైక్‌గా గుర్తింపు పొందడం విశేషం.